అంధ మహిళా క్రికెట్‌ క్రీడాకారులకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

అంధ మహిళా క్రికెట్‌ క్రీడాకారులకు ప్రోత్సాహం

Jun 9 2025 7:07 AM | Updated on Jun 9 2025 7:07 AM

అంధ మహిళా క్రికెట్‌ క్రీడాకారులకు ప్రోత్సాహం

అంధ మహిళా క్రికెట్‌ క్రీడాకారులకు ప్రోత్సాహం

ఉక్కునగరం: ఎన్టీపీసీ సింహాద్రి సహకారంతో క్రికెట్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌ ఆంధ్రప్రదేశ్‌, క్రికెట్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌ కేరళ సంయుక్త ఆధ్వర్యంలో ఉక్కు స్టేడియంలో అంతర్‌ రాష్ట్ర అంధ మహిళల క్రికెట్‌ పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అంధ మహిళా క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు. క్రీడాకారులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సుప్రీంకోర్టు అడ్వకేట్‌ శరత్‌బాబు, తన వంతుగా విజేత జట్టుకు రూ. 75 వేలు, రన్నరప్‌ జట్టుకు రూ. 25 వేలు బహుమతులుగా అందజేస్తానని ప్రకటించి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. పోటీలలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు, కేరళ జట్టుపై 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో ఒడిశా జట్టు, ఢిల్లీ జట్టును 49 పరుగుల తేడాతో ఓడించి గెలుపొందింది. కార్యక్రమంలో విజువల్లి ఛాలెంజ్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి. రవీంద్రబాబు, ఎన్టీపీసీ సింహాద్రి యూనిట్‌ ప్రతినిధి అనీల్‌, ఇండియన్‌ బ్లైండ్‌ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ అజయ్‌ కుమార్‌ రెడ్డి, కోఆర్డినేటర్లు అమ్మి నాయుడు, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement