
పౌష్టికాహారం, వ్యాయామంతో మంచి ఆరోగ్యం
రంపచోడవరం: మంచి ఆరోగ్యాన్ని పొందడం మన చేతుల్లోనే ఉందని, ఇందుకు మంచి పౌష్టికాహరం తీసుకుంటే వ్యాయామం చేయాలని సివిల్ జడ్జి టీవీ రాఘవేంద్రరావు అన్నారు. రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో రంపచోడవరంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలు అనారోగ్యం కలిగించే వాటికి దూరంగా ఉండాలని, చెడు వ్యసనాల బారిన పడవద్దని సూచించారు. వైద్య శిబిరంలో సుమారు 400 మందికి వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహరాజ్ తెలిపారు. స్వామి ప్రజ్ఞనాధనంద మహరాజ్, స్వామి లోకమయనంద మహరాజ్లు వైద్యశిబిరంలో రోగులకు అందుతున్న సేవలను పర్యవేక్షించారు. వైద్యులు జీవీ రామారావు, కస్తూరి సుబ్రమణ్యం, టీవీ సుబ్బారావు, దాసరి ఉమా మహేష్, ఎస్. సంపత్కుమార్, జీఎస్ఎల్ వైద్యులు సేవలు అందించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరంలో 87 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి పది మందిని కంటి ఆపరేషన్ల కోసం వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయానికి తరలించారు.
సివిల్ జడ్జి రాఘవేంద్రరావు