
నేటికీ తెరచుకోని డిపో
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం దుప్పిలవాడ పంచాయతీ బూసుకొండ సబ్ డిపో నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేయకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ఒకటి నుంచి ఎండీయూ వ్యవస్థను నిలిపివేసి డీఆర్ డిపోల ద్వారా సరుకులు పంపిణీకి కూటమి ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించినప్పటికి నేటికి మారుమూల ప్రాంతాలకు సరుకులు పంపిణీ చేయలేదు. మండలంలోని దుప్పిలవాడ పంచాయతీ బూసుకొండ జీసీసీ డిపో నుంచి ఇప్పటికీ సరుకులు పంపిణీ జరగకపోవడంతో కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని పరిధిలో వలసగెడ్డ, వలసగెడ్డ కాలనీ, శాండికొరి, పులిగొప్ప తదితర గ్రామాల ప్రజలు ఉన్నారు. తమకు రేషన్ సరకులు పంపిణీ చేసేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
రేషన్ సరుకులకు నోచుకోని
‘బూసుకొండ’ రేషన్ కార్డుదారులు
పంపిణీకి చర్యలు తీసుకోవాలని
డిమాండ్