
రాష్ట్రపతికి 'బ్లాక్' నేతల వివరాలు
బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.
న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న రాజకీయ నాయకుల వివరాలను ఆయన రాష్ట్రపతికి తెలిపారు. తనకు తెలిసిన 'బ్లాక్ మనీ' నేతల పేర్లను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లానని సుబ్రమణ్యస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.
తమిళనాడులో గత రెండు నెలల కాలంలో హత్యకు గురైన హిందూ నాయకుల గురించి కూడా రాష్ట్రపతి వద్ద ప్రస్తావించారు. ఐఎస్ఐ శిక్షణ పొందిన శ్రీలంక తమిళులు తమిళనాడులోకి ప్రవేశించి విధ్వంసాలకు పాల్పడుతున్నారని వివరించారు. వీరి ఆట కట్టించేందుకు చర్యలు చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్రపతిని సుబ్రమణ్యస్వామి కోరారు.