నిన్న మెరుపులు...నేడు ఫ్లాట్ | Sensex, Nifty open flat a day after Budget | Sakshi
Sakshi News home page

నిన్న మెరుపులు...నేడు ఫ్లాట్

Feb 2 2017 9:55 AM | Updated on Sep 5 2017 2:44 AM

బడ్జెట్ మెరుపులు మెరిపించిన బుధవారం మార్కెట్లు, గురువారానికి వచ్చేసరికి ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి.

బడ్జెట్ మెరుపులు మెరిపించిన బుధవారం మార్కెట్లు, గురువారానికి వచ్చేసరికి ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. నిన్న 486 పాయింట్ల ర్యాలీ జరిపిన సెన్సెక్స్ నేటి మార్నింగ్ సెషన్లో స్వల్పంగా 9 పాయింట్ల లాభంలో 28,150 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 3.20 పాయింట్ల లాభంలో 8719 వద్ద ట్రేడవుతోంది. ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్టీపీసీ, ఎస్బీఐ,  ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, బీపీసీఎల్ మార్నింగ్ ట్రేడ్లో లాభాల్లో నడిచాయి. 0.5-2 శాతం లాభాల్లో ఎగిశాయి. జనవరిలో ఆటో అమ్మకాలు 10 శాతం పడిపోవడంతో మహింద్రా అండ్ మహింద్రా 2 శాతం నష్టపోయింది. లాభాల స్వీకరణతో ఐడియా సెల్యులార్ 1.7 శాతం డౌన్ అయింది.
 
టాటా మోటార్స్, అరబిందో ఫార్మా, కోల్ ఇండియా, హీరో మోటార్ కార్పొ, విప్రోలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మార్నింగ్ ట్రేడ్లో డాలర్తో రూపాయి మారకం విలువ 4 పైసలు బలపడి 67.44 వద్ద ప్రారంభమైంది. కేంద్రబడ్జెట్, దేశీయ ఈక్విటీలకు, రూపాయికి పాజిటివ్గా ఉందని కొటక్ మహింద్రా బ్యాంకు మోహన్ షెనోయి చెప్పారు. ఫెడ్ ఈ సారి వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయదనే సంకేతాలు వెలువడుతుండటంతో డాలర్ ఇండెక్స్ పడిపోతుంది. బడ్జెట్లో వెలువరిచిన గ్రామీణ ప్రాంతాలపై, డిజిటల్, అఫోర్డబుల్ హౌసింగ్పై ఫోకస్ సిమెంట్ రంగాలకు, బ్యాంకులకు, రియాల్టీకి లబ్ది చేకూరుస్తుందని విశ్లేషకులన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement