ప్యానాసోనిక్...బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

ప్యానాసోనిక్...బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ - Sakshi

న్యూఢిల్లీ: ప్యానాసోనిక్ కంపెనీ ఆండ్రాయిడ్ ఆధారిత కొత్త స్మార్ట్‌ఫోన్, ప్యానాసోనిక్ టీ31ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.7,990గా నిర్ణయించామని పేర్కొంది. భారత మార్కెట్లోకి ప్యానాసోనిక్ కంపెనీ అందిస్తున్న ఐదో మోడల్ ఇది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్‌లో 4-అంగుళాల డబ్యూవీజీఏ డిస్‌ప్లే, డ్యుయల్ కోర్ ప్రాసెసర్,  3.2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇన్‌బుల్ట్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయి. భవిష్యత్తులో కూడా విస్తృతమైన స్థాయిలో ఫోన్ల ను అందించనున్నామని ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ పేర్కొన్నారు. 

 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top