
ప్రణబ్ తో మమత భేటీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశమయ్యారు.
కోల్ కతా: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశమయ్యారు. విమానాశ్రయంలో వేచివున్న ప్రణబ్ తో ఆమె చర్చలు జరిపారు.
గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో విమానాశ్రయానికి వచ్చిన మమతా బెనర్జీ 15 నిమిషాల పాటు రాష్ట్రపతితో సమావేశమయ్యారు. భేటీలో చర్చించిన విషయాలపై అధికారిక సమాచారం లేదు. రెండు రోజుల బెంగాల్ పర్యటన ముగించుకుని ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీకి తిరిగి వెళ్లారు.