మద్యం మత్తులో భార్యపై బాణంతో దాడి | Husband attack on wife with arrow in drunken | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో భార్యపై బాణంతో దాడి

Aug 11 2015 7:06 PM | Updated on Jul 18 2019 2:26 PM

జీకేవీధి మండలం లంకపాకలు గ్రామంలో ఓ భర్త భార్యపై బాణంతో దాడి చేశాడు.

విశాఖపట్నం(జీకేవీధి): జీకేవీధి మండలం లంకపాకలు గ్రామంలో ఓ భర్త భార్యపై బాణంతో దాడి చేశాడు. లంకపాకలు గ్రామానికి చెందిన సుభద్ర, పాండురాజు భార్యాభర్తలు. పాండురాజు తరచూ తాగి వచ్చి భార్యతో గొడవపడుతుంటాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన పాండు తన వెంట తెచ్చుకున్న బాణంతో ఆమె కంటిలో పొడిచాడు.

ఈ ఘటనలో సుభద్ర కంటిపై భాగంలో గాయమైంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement