చంద్రబాబు చరిత్రహీనుడు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు | chandra babu naidu obstructing special status to ap, says ummareddy venkateswarlu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చరిత్రహీనుడు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

Oct 7 2015 3:49 PM | Updated on Mar 23 2019 9:10 PM

చంద్రబాబు చరిత్రహీనుడు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు - Sakshi

చంద్రబాబు చరిత్రహీనుడు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చరత్రహీనుడిగా మిగిలిపోతారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిప్పులు చెరిగారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చరత్రహీనుడిగా మిగిలిపోతారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిప్పులు చెరిగారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటివరకు రూ. 13వేల కోట్ల నిధులు అందాయని ఓ యువ నాయకుడు గుంటూరులో నగ్నంగా అబద్ధాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం గుంటూరులో వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన సందర్భంగా ఆయన దీక్షావేదిక వద్ద ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..

  • నిరాహార దీక్షకు కూర్చున్న జగన్కు సంఘీభావం తెలపాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రత్యేక హోదా రాకుండా చేస్తున్న కుట్రను ఖండించాలని ఎండను, ఆకలిని లెక్కచేయకుండా ప్రజలంతా తరలివచ్చారు.
  • పార్లమెంటు సాక్షిగా చర్చ జరిగినా రాష్ట్రానికి ఇస్తానన్న ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వట్లేదు? ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయి.
  • ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి మేలు ఏవిధంగా జరుగుతుందో జగన్ ఇప్పటిదాకా వివరించారు.
  • ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ఫార్మా కంపెనీలు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్కు తరలివెళ్లాయి. అందుకు కారణం అక్కడ ప్రత్యేక హోదా ఉండటమే. అక్కడ ఉన్న రాయితీల వల్లే కంపెనీలు ఏపీ నుంచి తరలిపోయాయి.
  • కొండల నడుమ ఉన్న ఉత్తరాఖండ్లో వేల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 5 లక్షల పాతికవేలమందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ రాష్ట్రం ఆర్థికంగా బలపడింది.
  • అక్కడున్న కంపెనీలకు ఆదాయపన్ను, ఎక్సైజ్, రుణ రాయితీలు లభించాయి. ప్రత్యేక హోదా వల్లనే ఈ లబ్ధులు చేకూరాయి.
  • పార్లమెంటులో చర్చ సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే.. ఐదేళ్లు సరిపోదు పదేళ్లు ఇవ్వాలని అప్పట్లో వెంకయ్యనాయుడు కోరారు.
  • కొన్ని స్వలాభాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదా పోరాటానికి వెన్నుచూపుతున్నారు. చంద్రబాబుకు పోరాటపటిమ లేదు.
  • ప్రత్యేక ప్యాకేజీ అనేది ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయమా?
  • ప్రత్యేక ప్యాకేజీ అనేది కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ్డది మాత్రమే. అదే ప్రత్యేక హోదాతో చట్టబద్ధంగా ప్రభుత్వాలు మారినా రాష్ట్రానికి అన్ని ప్రయోజానాలు చేకురుతాయి.
  • పొద్దున్న లేస్తే ఒక్కటే పాట. రాజధాని, సింగపూర్, జపాన్ వీటి చుట్టే పాలన అంతా జరుగుతున్నది. ప్రజల కష్టాల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
  • ఇసుక దందా, లిక్కర్ దందా కొనసాగుతున్నా.. నిత్యావసర ధరలు ఆకాశన్నంటుతున్నా పట్టించుకోవడం లేదు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.
  • రుణమాఫీ లేదు.  విత్తనాలు లేవు. సబ్సిడీలు లేవు. ఖరీఫ్ పంటలు లేవు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు.
  • ఇంత దుర్భరంగా ఆంధ్రప్రజలు ఉంటే.. ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ చాలని మాట్లాడటం దారుణం.
  • ప్రత్యేక హోదా కోసం ప్రాణాలొడ్డి జగన్ నిరాహార దీక్షకు కూర్చున్నారు.
  • ఆయన నిరాహార దీక్ష ఫలితంగా ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా సాధించాలని కోరుతున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement