పేట్రేగిన పాక్ రేంజర్లు | Ceasefire violation by Pakistan in RS Pura sector, one civilian killed, 8 injured | Sakshi
Sakshi News home page

పేట్రేగిన పాక్ రేంజర్లు

Aug 28 2015 7:24 AM | Updated on Oct 2 2018 2:30 PM

ఆర్ఎస్ పురా సెక్టార్ లో శుక్రవారం తెల్లవారుజామున పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలిస్తున్న బంధువులు - Sakshi

ఆర్ఎస్ పురా సెక్టార్ లో శుక్రవారం తెల్లవారుజామున పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలిస్తున్న బంధువులు

కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలోతొక్కిన పాకిస్థాన్ మరోసారి రెచ్చిపోయింది. జమ్ముకశ్మీర్ లోని ఆర్ఎస్ పురా సెక్టార్ లో శుక్రవారం తెల్లవారజామున కాల్పులకు తెగబడింది.

- సరిహద్దు సమీప భారత గ్రామాలపై కాల్పులు
- ముగ్గురు పౌరుల  మృతి, 16 మందికిపైగా తీవ్ర గాయాలు

శ్రీనగర్:
కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలోతొక్కిన పాకిస్థాన్ మరోసారి రెచ్చిపోయింది. జమ్ముకశ్మీర్ లోని ఆర్ఎస్ పురా సెక్టార్ లో శుక్రవారం తెల్లవారజామున కాల్పులకు తెగబడింది. పాక్ రేంజర్ల కాల్పుల్లో  ముగ్గురు భారతీయ పౌరులు చనిపోగా, 16 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.


ఇంకా  కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మరింత అప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు పాక్ కు బుద్ధి చెప్పేపనిలో ఉన్నాయి. గురువారం పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాన్ చనిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత్ లో మారణహోమం సృష్టించేందుకు గురువారం సరిహద్దు దాటి కశ్మీర్ లోకి ప్రవేశించిన నలుగురు పాక్ ఉగ్రవాదుల్లో ఒకరిని భారత సైన్యం సజీవంగా పట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement