పూజల పేరుతో చెట్టుకు కట్టేసి కొట్టారు | two men attacked in warangal | Sakshi
Sakshi News home page

పూజల పేరుతో చెట్టుకు కట్టేసి కొట్టారు

May 12 2015 4:29 PM | Updated on Aug 25 2018 6:13 PM

పూజల పేరుతో ఇద్దరు వ్యక్తులను చెట్టుకు కట్టేసి తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు.

తాడ్వాయి (వరంగల్) : పూజల పేరుతో ఇద్దరు వ్యక్తులను చెట్టుకు కట్టేసి తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఏజెన్సీ గ్రామమైన మేడారంలో గుర్తు తెలియని కొందరు.. ఇద్దరు వ్యక్తులను చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. గమనించిన స్థానికులు వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఒకరు నల్లగొండ జిల్లాకు చెందిన లక్ష్మయ్య కాగా మరొకరు ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన వారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement