విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి | two farmers died over electric shock in wanaparthy | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి

Feb 1 2016 3:19 PM | Updated on Sep 5 2018 2:26 PM

మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. వనపర్తి మండలం అంకూరులో విద్యుత్ షాక్తో ఇద్దరు రైతులు మృతిచెందారు.

వనపర్తి : మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. వనపర్తి మండలం అంకూరులో విద్యుత్ షాక్తో ఇద్దరు రైతులు మృతిచెందారు. 

సోమవారం బోరుబావిలో రైతులు మోటారు దించుతుండగా ప్రమాదవశాత్తూ పైపు, పైన ఉన్న కరెంటు తీగలు తగిలాయి. దీంతో బాలయ్య(51), ఆంజనేయులు(40) అనే రైతులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. తోటిరైతుకు సాయం చేయడానికి వెళ్లిన ఆంజనేయులు కూడా ప్రాణాలు కోల్పోయాడు. రైతుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement