గోదావరి పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుందని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.
కరీంనగర్: గోదావరి పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుందని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. పుష్కర స్నానాలకు నీటి కొరత లేకుండా చేస్తామన్నారు. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నీటిని పుష్కరస్నానాలకు విడుదల చేస్తామన్నారు.
ఈనెల 13 వ తేదీ రాత్రికి సీఎం కేసీఆర్ ధర్మపురికి చేరుకుంటారని, 14 వ తేదీన ఉదయం గం.6.28 ని.లకు పుష్కరస్నానం చేస్తారని ఈటెల తెలిపారు.