కృష్ణానదిలో తేలిన పురాతన సంగమేశ్వరాలయం | Sakshi
Sakshi News home page

కృష్ణానదిలో తేలిన పురాతన సంగమేశ్వరాలయం

Published Tue, Feb 21 2017 3:06 AM

నీట తేలిన ఆలయం.. (ఇన్‌సెట్‌లో) ఆలయంలో పూజలు చేసున్న శివమాలధారులు

కొల్లాపూర్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా సోమశిల సమీపంలోని కృష్ణానది ఆవలి ఒడ్డున ఉన్న సంగమేశ్వరాలయం తేలింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ గుడి పూర్తిగా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయిన విషయం విదితమే. తూర్పుభాగంలోని గర్భగుడిలో మోకాళ్లలోతు వరకూ ఇంకా నీళ్లు ఉన్నాయి.

వారం రోజులుగా నీటి మట్టం భారీగా తగ్గడంతో గుడి పడమటి భాగం పూర్తిగా తేలింది. దీంతో ఆలయ అర్చకులు రఘురామశర్మ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం శివమాలధారులు గర్భగుడిలోని వేపలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement