రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. అధికారులపై దాడి | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. అధికారులపై దాడి

Published Sat, Mar 14 2015 6:06 PM

sand mafia attacks officers in mahaboobnagar

కోడేరు : మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. తమ వ్యాపారానికి అడ్డు వస్తున్నారన్న కారణంతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రఘు, గ్రామ రెవెన్యూ అధికారి కృష్ణయ్యలపై దాడికి దిగింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలంలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే...  కోడేరు మండలం మైలారం, నాగులపల్లి వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ప్రజల నుంచి ఫోన్‌కాల్ రావడంతో శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆర్‌ఐ రఘు, వీఆర్‌ఓ కృష్ణయ్య హుటాహుటిన బయల్దేరారు. తీగలపల్లి సమీపంలోని ఈరన్నగట్టు వద్ద రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. దీంతో అక్కడే ఉన్న గుడిపల్లికి చెందిన మధుసూదన్‌రెడ్డి, గున్న రాములు వారిపై దాడిచేసి గాయపరిచారు. దీనిపై అధికారులు శనివారం ఉదయం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement