రోడ్డు ప్రమాదంలో తల్లికొడుకు మృతి | mother and son died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో తల్లికొడుకు మృతి

Aug 12 2015 1:08 PM | Updated on Sep 2 2018 4:37 PM

వేగంగా వెళ్తున్న రెండు కార్లు ఢీకొనడంతో తల్లికొడుకు మృతి చెందారు.

నాగర్‌కర్నూలు: వేగంగా వెళ్తున్న రెండు కార్లు ఢీకొనడంతో తల్లికొడుకు మృతి చెందారు. ఈ సంఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు మండలం కొల్హాపూర్ గ్రామంలో జరిగింది. వివరాలు.. కొల్హాపూర్ నుంచి నాగర్‌కర్నూలు వెళ్తున్న తుఫాన్ వాహనం నాగర్‌కర్నూలు నుంచి అచ్చంపేట వెళ్తున్న ఇండికా కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో పెద్దగుట్లపల్లి మండలం గండ్రావుపల్లి గ్రామానికి చెందిన తల్లీకొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన మహిళను మెరుగైన వైద్యం కోసం నాగర్‌కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement