విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన చెందవద్దు | minister kadiyam srihari ensure of sutudents, parents over eamcet-2 leak issue | Sakshi
Sakshi News home page

విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన చెందవద్దు

Jul 28 2016 11:25 AM | Updated on Nov 9 2018 4:46 PM

విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన చెందవద్దు - Sakshi

విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన చెందవద్దు

ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంలో విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తామని కడియం హామీ ఇచ్చారు.

హైదరాబాద్ : ఎంసెట్-2 పేపర్ లీకైందని సీఐడీ అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసి, ఎంసెట్-3 నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున గురువారం సచివాలయానికి చేరుకున్నారు. తిరిగి పరీక్ష నిర్వహించవద్దని వారు విజ్ఞప్తి చేశారు. సచివాలయం ఎదురు ధర్నాకు సిద్ధమయ్యారు.

మరోవైపు ఉప ముఖ్యమత్రి కడియం శ్రీహరి గురువారం వరంగల్లో మాట్లాడుతూ  విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై సీఐడీ నివేదిక  పూర్తిస్థాయిలో వచ్చాకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కడియం శ్రీహరి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement