కాల్వ దాటలేక.. వైద్యం అందక | man dead with fever | Sakshi
Sakshi News home page

కాల్వ దాటలేక.. వైద్యం అందక

Oct 10 2017 1:23 PM | Updated on Oct 8 2018 5:07 PM

man dead with fever  - Sakshi

హన్మంత్‌నాయక్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

మహబూబ్‌నగర్‌, చిన్నచింతకుంట (దేవరకద్ర) : మండలంలోని పర్దీపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని గోప్యానాయక్‌తండా, జమ్ములానాయక్‌తండా, సింగ్యానాయక్‌తండా, పోల్యానాయక్‌తండాలకు రహదారి లేక ఆయా తండాలగిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. పర్దీపూర్‌ చెరువు అలుగు పారి రహదారి తెగిపోవడంతో తండావాసులకు ప్రయాణ సౌకర్యాలకు నోచుకోలేకపోతున్నారు. దీంతో వర్షాకాలంలో ఎలాంటి రోగాలు వచ్చిన వైద్యానికి నోచుకోక తండాలోనే తల్లడిల్లాల్సిన పరిస్థితి దాపురిస్తుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సింగ్యానాయక్‌తండాకు చెందిన హన్మంతునాయక్‌ జ్వరంతో బాధపడుతున్నాడు.

కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా పర్దీపూర్‌ చెరువు అలుగు పారడంతో అష్టకష్టాలు పడుతూ కాల్వ దాటుతుండగానే వైద్యం అందక మృతిచెందాడు. అలాగే పాఠశాల విద్యార్థులకు పై చదువులకు వెళ్లడానికి రహదారి లేక చదువులు మానేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అధికారులు తమ తండాలపై దృష్టిసారించి రహదారి సౌకర్యం కల్పించి ఇబ్బందులు తీర్చాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement