నేటి ముఖ్యాంశాలు..

Major Events On 11th April - Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
► ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 381కి చేరింది.
► ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో ఆరుగురు మృతి చెందారు.
► కరోనా నుంచి కోలుకుని 10 మంది డిశ్చార్జ్ అయ్యారు.
► ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 365 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

తెలంగాణ:

►  తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 487కి చేరింది.
►  తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 12 మంది మృతి చెందారు.
►  కరోనా నుంచి 45 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
► తెలంగాణలో ప్రస్తుతం 430 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

► నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
► సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ
► కరోనా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, లాక్‌డౌన్‌పై చర్చ

జాతీయం: 
► దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,412గా నమోదయ్యాయి.
► ఇప్పటివరకు దేశంలో కరోనాతో 199 మంది మృతి చెందారు.
► కరోనా నుంచి 503 మంది బాధితులు కోలుకున్నారు.

► నేడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌
► ఉదయం 11 గంటలకు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌
► లాక్‌డౌన్‌ పొడిగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం
► అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

అంతర్జాతీయం:
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 16.97 లక్షలు దాటింది. 
► 209 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్
► ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య లక్ష దాటింది.
► ఇప్పటివరకు కరోనా నుంచి 3.76 లక్షల మంది కోలుకున్నారు.
► అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. 
► అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో 18,699 మంది మృతి చెందారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top