నలుగురు రైతుల ఆత్మహత్య
సాక్షి, నెట్వర్క్: నమ్ముకున్న ఎవుసం నట్టేట ముంచింది. పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం తెచ్చిన అప్పులు కుప్పలుగా మారాయి. దీంతో రైతులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయి. సోమవారం మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు, మహబూబ్నగర్ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
► మహబూబ్నగర్ జిల్లా పెద్దమందడి మం డలం బలీదుపల్లిలో కుమ్మరి సూగూరు నాగన్న(41) కిందటి ఏడాది ఖరీఫ్లో మూడు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట వర్షాభావం వల్ల ఎండిపోయింది. కుటుంబ అవసరాలకు, వ్యవసాయం కోసం చేసిన అప్పులు రూ.2 లక్షలకుపైగా అయ్యాయి. అప్పులు తీర్చే మార్గం కానరాక ఆదివారంరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మల్దకల్ మండలం తాటికుం టలో బోయ వీరన్న(45) నాలుగు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి, ఆముదం పంటలు సాగు చేశాడు. పెట్టుబడుల కోసం దాదాపు రూ.4 లక్షలకుపైగా అప్పులు చేశాడు. పంటలు సరిగా పండక అప్పులు పెరిగిపోయాయి. దీంతో అప్పులు తీర్చలేక సోమవారం ఉరేసుకున్నాడు. పెద్ద దిక్కు లేక ఆయన కుటుంబం వీధిన పడింది.
► నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని వన్నెల్(బి)లో మామిడి చిన్న దేవన్న (38) ఖరీఫ్లో మొత్తం మూడున్నర ఎకరాల భూమిలో పసుపు, సోయా, మొక్క జొన్న పం టలు సాగు చేశాడు. వర్షాభావంతో పంటల కు నీరందక ఎండిపోయాయి. రూ.4 లక్షల అప్పు తీర్చేదెలా.. అంటూ మథన పడేవాడు. ఈ క్రమంలో సోమవారం పురుగు మందు తాగాడు. పెద్దదిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచనిస్థితిలో పడింది. 10వ తరగతి పూర్తి చేసిన కుమారుడి పైచదువు తం డ్రి మరణంతో ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.
► మెదక్ జిల్లా రామాయంపేట మండలం నగరం తండాకు చెందిన గుగ్లోత్ రంజా (65) రూ.4 లక్షల వరకు అప్పు చేసి నాలుగు బోర్లు తవ్వించినా ఒక్కదానిలోనూ నీళ్లు పడలేదు. మనవరాలి పెళ్లికి మరికొంత అప్పు చేశాడు. పంటలసాగు లేక, అప్పులు తీర్చలేకపోవడంతో సోమవారం ఉరేసుకున్నాడు.
పంటలు పండక.. అప్పులు తీరక..
Published Tue, Jun 7 2016 9:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
జగన్ పాటకే భయపడ్డారు!
‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్కు రెబల్గా మారనుంది’
భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement