కౌలు రైతు మృతి | farmer commits suicide | Sakshi
Sakshi News home page

కౌలు రైతు మృతి

Mar 29 2017 11:47 AM | Updated on Nov 6 2018 7:53 PM

అప్పుల బాధ భరించలేక వాసం గోపీ(37) అనే కౌలురైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

జూలూరుపాడు(భద్రాద్రి కొత్తగూడెం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కరివారిగూడెం గ్రామంలో ఉగాది పర్వదినం నాడు విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ భరించలేక కరివారిగూడెం గ్రామానికి చెందిన వాసం గోపీ(37) అనే కౌలురైతు మంగళవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. ఆయనకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement