ప్రాధాన్యతల మేరకే నిధుల వ్యయం: కేటీఆర్ | Existence importance to the cost of funds: ktr | Sakshi
Sakshi News home page

ప్రాధాన్యతల మేరకే నిధుల వ్యయం: కేటీఆర్

Oct 30 2014 2:52 AM | Updated on Aug 30 2019 8:24 PM

ప్రాధాన్యతల మేరకే నిధుల వ్యయం: కేటీఆర్ - Sakshi

ప్రాధాన్యతల మేరకే నిధుల వ్యయం: కేటీఆర్

ప్రజల ద్వారానే ప్రభుత్వ విధానాలు రూపొందాలన్న లక్ష్యంతో మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించామని,

హైదరాబాద్: ప్రజల ద్వారానే ప్రభుత్వ విధానాలు రూపొందాలన్న లక్ష్యంతో మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రజల ప్రాధాన్యతల మేరకే నిధులను ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఇటీవల మంజూరైన 13వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై  జిల్లాల అధికారులకు బుధవారం సచివాలయంలో ఆయన పలు సూచనలు చేశారు. జనాభా ఆధారంగానే నిధుల కేటాయింపు ఉంటుందని చెప్పారు.

మీ-సేవ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ

కులం, ఆదాయం వంటి ధృవపత్రాలన్నీ మీ సేవ కేంద్రాల ద్వారానే ఇప్పించాలని మంత్రి కేటీఆర్‌ను బుధవారం సచివాలయంలో మీ సేవ ప్రతినిధులు కలిశారు.   ఉపాధి బకాయిలను వెంటనే చెల్లించాలని మంత్రికి వినతి కేంద్రప్రభుత్వం పెంచిన మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని మంత్రి కేటీఆర్‌ను వ్యవసాయ కార్మిక సంఘం కోరింది. సంఘం ప్రతినిధులు బుధవారం మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement