ముగిసిన మండలి  ఎన్నికల ప్రచారం  | Ended Council election campaign | Sakshi
Sakshi News home page

ముగిసిన మండలి  ఎన్నికల ప్రచారం 

Mar 21 2019 3:49 AM | Updated on Mar 21 2019 3:49 AM

Ended Council election campaign - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు ఈ నెల 22న (రేపు) ఎన్నికలు జరగనున్నాయి. మండలి ఎన్నికల ప్రచార పర్వం బుధవారంతో ముగిసింది. మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–కరీంనగర్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలతోపాటు వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 17 మంది, మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–కరీంనగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఏడుగురు, వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement