ప్రాణం తీసిన క్రికెట్‌ బెట్టింగ్‌! | Cricket betting taken the life | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన క్రికెట్‌ బెట్టింగ్‌!

Jul 8 2017 2:16 AM | Updated on Nov 6 2018 8:08 PM

క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడిన ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకున్నాడు.

శంకర్‌పల్లి మండలం దొంతన్‌పల్లిలో ఘటన
 
శంకర్‌పల్లి (చేవెళ్ల): క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడిన ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహారాజ్‌పేట్‌ పంచాయతీ శివారు దొంతన్‌పల్లికి చెందిన బిక్షపతి, పోచమ్మల కుమారుడు విజయ్‌కుమార్‌ (19) ఇంటర్‌ ఫెయిలయ్యాడు. అప్పటి నుంచి తండ్రికి వ్యవసాయపనుల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. విజయ్‌ ఈ నెల 2న తండ్రిని రూ.10 వేలు అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్ప డంతో తండ్రితో గొడవ పెట్టుకున్నాడు. పొలానికి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిన విజయ్‌ మధ్యాహ్నం చెట్టుకు ఉరివేసుకోగా, ఆలస్యంగా వెలుగుచూసింది.

కాగా, డబ్బులు ఇవ్వలేదని తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి భిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన సెల్‌ఫోన్‌లో ఫ్రెండ్స్‌కు బెట్టింగ్‌ చేయకండి ప్లీజ్‌.. బెట్టింగ్‌ కారణంగానే నేను చనిపోతు న్నాను.. మామవాళ్లు, అన్నవాళ్లు ఎవరూ బెట్టింగ్‌ చేయకండి.. అంటూ సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్‌ ద్వారా తన స్నేహితులకు పంపించాడు. మూడు రోజుల తర్వాత తల్లిదండ్రులు వాట్సాప్‌లో తన కుమారుడు క్రికెట్‌ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని చనిపోయాడనే విషయం తెలుసుకున్నారు. విజయ్‌ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోన్‌కాల్స్‌ ఆధారంగా వారిని గుర్తించనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement