మరో 1,550 పాజిటివ్‌ కేసులు | CoronaVirus: 1550 New Positive Cases In Telangana | Sakshi
Sakshi News home page

మరో 1,550 పాజిటివ్‌ కేసులు

Jul 14 2020 2:59 AM | Updated on Jul 14 2020 2:59 AM

CoronaVirus: 1550 New Positive Cases In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా మరో 1,550 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌–19 కేసుల సంఖ్య 36,221కు చేరింది. ఇందులో 12,178 యాక్టివ్‌ కేసు లుండగా, 23,679 మంది కోలు కున్నారు. తాజాగా కేసుల్లో అధి కంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 926 వచ్చాయి. రంగారెడ్డిలో 212, కరీంనగర్‌లో 86, మేడ్చల్‌లో 53, నల్లగొండలో 41, ఖమ్మంలో 38, కామారెడ్డిలో 33, సంగారెడ్డిలో 19, వరంగల్‌ అర్బన్‌లో 16, మహబూబ్‌నగర్, మహబూబా బాద్‌ జిల్లాల్లో 13 చొప్పున, జనగాం, కొత్తగూడెం, సిద్దిపేట్, సూర్యాపేట్‌ జిల్లాల్లో 10 చొప్పున  వరంగల్‌ రూరల్, నిజామాబాద్‌ జిల్లాల్లో 8 చొప్పున, సిరిసిల్లలో 7, భూపాలపల్లి, పెద్దపల్లి, మెదక్‌ జిల్లాల్లో 6 చొప్పున, యాదాద్రి, గద్వాల జిల్లాల్లో 5 చొప్పున, వికారాబాద్‌లో 3, నాగర్‌కర్నూల్‌లో 2, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 11,525 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇందులో 9,975 మందికి నెగిటివ్‌ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,81,849 శాంపుల్స్‌ను పరీక్షించగా 1.45.628 మందికి నెగిటివ్‌ వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్‌–19తో సోమవారం మరో 9మంది మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 365కు చేరింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement