తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా హుస్నాబాద్ మండలం మహాసముద్రం గండి పూడ్చివేత పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం అదే మండలంలోని గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లను కేసీఆర్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత సీఎం దత్తత తీసుకున్న చిగురుమామిడి మండలం ములకనూరు లో నిర్వహించే గ్రామసభలో పాల్గొంటారు.