ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో చంద్రబాబు టీటీడీపీ నేతలతో చర్చలు జరిపారు.
ఓటుకు కోట్లు కేసు బయటపడిన తర్వాత చంద్రబాబు తరచూ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చేశారంటూ విమర్శలు వస్తున్నాయి.