► మార్కెట్ యార్డుల్లో రూ.5కే ఆహారం: హరీశ్రావు
► సంగారెడ్డి జిల్లా కందిలో కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ
► ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో నిర్మాణం
సంగారెడ్డి రూరల్: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులకు వచ్చే రైతులందరికీ అక్షయపాత్ర ద్వారా రూ.5కే భోజనం అందజేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో రూ.18 కోట్లతో నిర్మించనున్న అక్షయపాత్ర మెగా కిచెన్కు మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలోని పలుచోట్ల వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులకు రూ.5కే అక్షయపాత్ర భోజనాన్ని అందజేస్తున్నా మన్నారు. మిగతా మార్కెట్ యార్డుల్లోనూ ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. అక్షయ పాత్రకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
విద్యను మరింత మందికి చేరువ చేయడంతోపాటు ఆకలిని తీరుస్తూ పౌష్టికాహార లోపాన్ని అధిగమించడానికి అక్షయపాత్ర చేస్తోన్న కృషిని మంత్రి అభినందించారు. ఏటా రాష్ట్రంలో రూ. 600 కోట్లతో గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధామూర్తి మాట్లాడుతూ.. ప్రస్తుతం కందిలో మెగా కిచెన్ను అన్ని హంగులతో నిర్మించి జిల్లాలో లక్ష మంది విద్యార్థులకు సరిపడా భోజనాన్ని తయారు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సీహెచ్ మదన్రెడ్డి, అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధుపండిత్ దాసా, తెలుగు రాష్ట్రాల అక్షయ పాత్ర అధ్యక్షులు సత్యగౌరదాస, డీఈఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అక్షయపాత్ర భోజనం
Published Thu, Dec 8 2016 2:12 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటమి భయంతో.. బూతులు.. దాడులు.. కుట్రలు
వందలాది కోట్లతో అభివృద్ధి పనులు..
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సామ్సన్పై జరిమానా
కాంగ్రెస్, బీజేపీవి కుయుక్తులు..
తాగునీటి కోసం 1.9 టీఎంసీలు విడుదల
అమిత్షా సభను జయప్రదం చేద్దాం
ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం
కేసీఆర్తోనే సంక్షేమం, అభివృద్ధి
కేంద్ర మంత్రి పర్యటనకు పకడ్బందీ బందోబస్తు
నేలకొరిగిన స్తంభాలు.. రాలిన మామిడి కాయలు
తప్పక చదవండి
- నన్ను నమ్మండీ! నేను ఇది వరకులా కాను!!
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement