► ఇబ్బందులుపడ్డ రోగులు
► హైకోర్టుకు వెళ్లిన వైద్యుల బృందం
► హెచ్ఆర్సీ, ఎంపీ కవితకు విన్నపం
జగిత్యాల అర్బన్/కోరుట్ల : అపెండిసైటిస్, గర్భసంచుల ఆపరేషన్ల కేసులో జగిత్యాలకు చెందిన తాటిపాముల సురేష్కుమార్, కోరుట్లకు చెందిన డాక్టర్ మనోజ్కుమార్ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల వైద్యులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈమేరకు కోరుట్ల, మెట్పల్లిలో నిరవధిక బంద్కు పిలుపునివ్వగా జగిత్యాలలోనూ బంద్ కొనసాగుతోంది. శనివారం జిల్లా వ్యాప్తంగా బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్లోని రాష్ట్ర మానవహక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కి శుక్రవారం విన్నవించారు. అంతేకాకుండా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను సైతం కలిసి డాక్టర్ల సమస్యపై వినతిపత్రం అందజేశారు.
హైకోర్టులో క్రాస్ పిటిషన్, రిట్ పిటిషన్ సైతం దాఖలు చేశారు. ఫిర్యాదు చేసిన బాధితులు ఏడాది క్రితం ఆపరేషన్ చేసుకున్నారని, మళ్లీ కడుపునొప్పి ఉందనే చెప్పారే తప్ప బలవంతంగా చేయలేదన్నారు. కానీ పోలీసులు 420 కేసులు నమోదు చేశారని హెచ్ఆర్సీ ఎదుట వారు ఆవేదన వ్యక్తం చేశా రు. హెచ్ఆర్సీ సైతం పత్రికల్లో వచ్చిన కథనాల మేరకే దర్యాఫ్తు చేయమన్నామే తప్ప వేరేగా ప్రయత్నించలేదని చెప్పినట్లు తెలిసింది. ఈ సమస్యలన్నీ ఎంపీ కవిత దృష్టికి సైతం తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని ఆమె చెప్పినట్లు సమాచారం.
నేటి బంద్కు నిర్ణయం?
శనివారం జిల్లాస్థాయిలో ఆస్పత్రులను బంద్ చేయడంతోపాటు సమావేశం సైతం నిర్వహించనున్నట్లు తెలిసింది. అక్రమంగా అరెస్ట్లు చేస్తే నిరవధిక సమ్మె చేపట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
రోగులకు తప్పని తిప్పలు
వైద్యులందరూ నిరవధిక బంద్ చేపడుతుండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తెలియక నిత్యం హాస్పిటల్కు వస్తూ పోతున్నారు. ఉన్నతాధికారులు స్పందిస్తేగానీ సమస్య పరిష్కారం అయ్యేలా లేదు.
కోరుట్ల-మెట్పల్లి బంద్ కాల్ ఆఫ్
వైద్యుల ఆరెస్టుతో బంద్కు పిలుపునిచ్చిన ఐఎంఏ ప్రతినిధులు రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో బంద్ పిలుపును ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఐఎంఏ సెంట్రల్ కమిటీ సభ్యుడు వైద్యుడు అనూప్రావు ‘సాక్షి’తో మాట్లాడారు. శనివారం నుంచి తాము ఆస్పత్రులు తెరిచి వైద్యసేవలు అందిస్తామన్నారు. కోరుట్ల-మెట్పల్లి ప్రాంతంలో రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. శనివారం నుంచి ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు చెప్పారు.
కోరుట్లలో రోగుల పాట్లు
ఈమె పేరు సామల్ల మహేశ్వరి. కోరుట్లలోని 21వ వార్డులో నివాసముంటుంది. తొమ్మిది నెలల గర్భిణి మహేశ్వరీ శుక్రవారం ఉదయం పురిటినొప్పులతో ఇబ్బందులు పడుతుండడంతో బంధువులు హడావిడిగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బంద్ బోర్డు ఉండడంతో.. ఏం చేయూలో తెలియలేదు. అన్ని ఆస్పత్రులు బంద్ ఉన్నాయని తెలుసుకుని చివరికి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ మహేశ్వరి బాబుకు జన్మనిచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో పిల్లల డాక్టర్ లేకపోవడంతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు వెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ఈ పరిస్థితి మహేశ్వరీదే కాదు. ఈ ప్రాంతంలో ప్రైవేట్ ఆస్పత్రులు బంద్ ఉండడంతో చాలా మంది ఇబ్బందులుపడ్డారు. హృద్రోగి కోరుట్లకు చెందిన ఎక్కల్దేవి నారాయణ, కథలాపూర్ మండలం తుర్తికి చెందిన గర్భిణి జమున అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తిరిగి చివరికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు.
ఆస్పత్రులు బంద్
Published Sat, Apr 23 2016 3:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement