రైల్వే హైటెన్షన్ వైర్లపై దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం | A man attempt to suicide at Madhira railway station | Sakshi
Sakshi News home page

రైల్వే హైటెన్షన్ వైర్లపై దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Feb 7 2015 8:06 PM | Updated on Sep 2 2017 8:57 PM

రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జిపై నుంచి హైటెన్షన్ వైర్ల పైకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఖమ్మం: రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జిపై నుంచి హైటెన్షన్ వైర్ల పైకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని మధిర రైల్వేస్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. కాగా, క్షతగాత్రడు శ్రీకాకుళం జిల్లా రేగడికి చెందిన వెంకటరమణగా రైల్వే పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement