breaking news
-
రేవంత్, బండి సంజయ్లది డ్రామా: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:గ్రూప్ 1పై సీఎం రేవంత్, బండి సంజయ్ డ్రామా ఆడుతున్నారని, బండి సంజయ్కి భద్రత ఇచ్చి రేవంత్ రోడ్లపైకి పంపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.గ్రూప్-1 పరీక్షపై బండి సంజయ్ని సీఎం రేవంత్ చర్చలకు పిలవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బండి సంజయ్ని చర్చలకు పిలిస్తే ఏం లాభం అని ప్రశ్నించారు. పేపర్ లీక్ చేసిన ఆయనను చర్చలకు ఎలా పిలుస్తారని ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: గ్రూప్ 1 రగడ.. సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత -
బుల్డోజర్లు రెడీ.. ఎవరు అడ్డం వస్తారో రండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అనుమతులు ఉన్న వాళ్ళు హైడ్రాకు భయపడాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే, పేదలు ఎవరైనా ఫామ్హౌస్లు కట్టుకోగలుగుతారా? ప్రశ్నించారు. బుల్డోజర్ సిద్ధంగా ఉంచాను.. ఎవరు అడ్డం వచ్చి పడుకుంటారో రండి అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.సీఎం రేవంత్ రెడ్డి శనివారం చార్మినార్ వద్ద మాట్లాడుతూ.. తెలంగాణలో అక్రమార్కుల కంటికి కునుకు లేకుండా చేస్తాను. ఈరోజు మూసీ దగ్గరికే వచ్చా.. సవాలు విసిరిన హరీష్ ఎక్కడ పోయాడు?. హైడ్రా అనగానే ఈటల, హరీష్, కేటీఆర్ బయటకి వచ్చారు. హైడ్రాకి పేదలు ఎవరూ భయపడడం లేదు. చెరువులు, నాలాలు ఆక్రమించుకున్న వాళ్లు భయపడుతున్నారు. అనుమతులు ఉన్న వాళ్ళు హైడ్రాకు భయపడాల్సిన అవసరం లేదు. అధికారులు అడిగినప్పుడు మీ అనుమతి పత్రాలు చూపించండి.రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడతాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరూ భయపడకండి. పెద్దలను కట్టడి చేసి పేదలకు పంచుతాం. నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకుంటాం. మురికిలో మునిగి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సాయం చేస్తాం. హైడ్రా వేరు, మూసీ ప్రక్షాళన వేరు. పేదలు తాగే నీళ్ళలో డ్రెనేజీ కలిపే వాళ్ళని చెరువులో తోక్కుతాంబుల్డోజర్ ఖాళీగా ఉంచాను. ఎవరు అడ్డం వచ్చి పడుకుంటారో రండి. కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమంగా కట్టుకోలేదా.. పోయి చూద్దాం రండి. అజీజ్ నగర్లో హరీష్ ఫామ్ హౌస్ లేదా?. తన ఫామ్హౌస్ మీదికి బుల్డోజర్ వస్తుందని కేటీఆర్, హరీష్ భయపడుతున్నాడు. హరీష్, కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి నిజనిర్ధారణ కమిటీని పంపిస్తాం. మూసీని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇళ్లను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
బీఆర్ఎస్ చేసిన పనులకు రేవంత్ రిబ్బన్ కట్: కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ వేశారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారని కామెంట్స్ చేశారు. అలాగే, బీఆర్ఎస్ చేసిన పనులకు రేవంత్ రిబ్బన్ కట్ చేస్తున్నారని సెటైర్లు వేశారు.నాగోల్ మూసీ పరివాహక ప్రాంతంలో కేటీఆర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘హైదరాబాద్కు మూసీ నది ఓ వరం. కాంగ్రెస్ హయాంలోనే మూసీ మురికి కూపంగా మారింది. మూసీ బాధితుల తరఫున న్యాయపోరాటం చేస్తాం. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మూసీని పునరుజ్జీవనం చేసేందుకు ఎన్టీపీ ప్లాంట్ నిర్మాణం చేశాం. ఎన్టీపీ లాంటి ప్లాంట్ దేశంలో ఎక్కడా లేదు. నాగోల్లో దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించాం. ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు నల్లగొండ జిల్లాకు పోతున్నాయి. రేవంత్ రెడ్డి కొత్తగా చేసేదేమీ లేదు. ఈ ఎస్టీపీలను సక్రమంగా నడుపుకుంటే చాలు.బీఆర్ఎస్ చేసిన పనులకు రేవంత్ రిబ్బన్ కట్ చేస్తున్నారు. హైదరాబాద్కు రేవంత్ కొత్తగా చేసిందేమీ లేదు. మూసీ గురించి నాకు తెలుసు. మూడు నెలలు కాదు.. మూడేళ్లు ఉంటాను. నేను గతంలో మూసీ నిబోలి అడ్డాలోనే ఉన్నా. ఢిల్లీ పెద్దలకు నువ్వు డబ్బులు పంపాలంటే చందాలు వేసుకుని ఇస్తాం. మూసీ ప్రజలను ఇబ్బంది పెట్టకండి అంటూ కామెంట్స్ చేశారు. -
గ్రూప్-1 సమస్యపై రాహుల్ గాంధీ స్పందించాలి: హరీష్ రావు
సిద్దిపేట, సాక్షి: గ్రూప్-1 అభ్యర్థుల ఆర్తనాదాలు కాంగ్రెస్కు వినిపించటం లేదా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ప్రశ్నించారు. ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడారు. ‘‘గ్రూప్-1 అభ్యర్థులు సమస్యలపై రాహుల్ గాంధీ స్పందించాలి. జీవో 29లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యర్థులు అన్యాయం అవుతారు. రైతులు, ఉద్యోగులను నిరుద్యోగులను దగా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోంది. ఈ ఖరీఫ్ సీజన్కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చావు కబురు చల్లగా చెప్పారు. .. సీఎం రేవంత్ రెడ్డి నువ్వు ముక్కు నేలకు రాయాలి. మాట తప్పినందుకు. మూసి కోసం రూ. లక్షా 50 వేలు ఉంటాయి. కానీ రైతులకు రూ. 15 వేలు ఇవ్వలేవా? రుణమాఫీ విషయంలో మోసం చేశావు. బోనస్ విషయంలో మోసం చేశావు. ఇప్పుడు రైతు బంధు విషయంలో మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడిక్కడ నిలదీయాలని పిలుపునిస్తున్నాం’’ అని అన్నారు.చదవండి: కేటీఆర్ వల్లే బీఆర్ఎస్కు ఇలాంటి పరిస్థితి: బండి సంజయ్ -
మూసీని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడుకోం
లక్డీకాపూల్: బీఆర్ఎస్ ప్రభుత్వంలా మూసీనదిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడుకోబోమని, దానిని పూర్తిస్థాయిలో పునరుజ్జీవింపజేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని హామీనిచ్చారు. ప్రగతిభవన్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మూసీ పరీవాహక ప్రాంతాల స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.17 మూసీ పునరావాస మహిళా సంఘాలకు రూ.3.33 కోట్ల ఆర్థిక సహాయాన్ని మలక్పేట్, కార్వాన్ ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ బలాల, కౌసర్ మొహియుద్దీన్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డిలతో కలసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ...ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్ వంటి ప్రాంతాలు వరదల వల్ల నష్టపోయాయని, మూసీ మురికి నీటి కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూసీ నీటిని తాగే స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళనలో జీహెచ్ఎంసీ పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజ్, మూసీ జేడీఎం గౌతమి, శ్రీనివాస్రెడ్డి, మూసీ ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు. -
చాలెంజ్ చేస్తున్నా.. వస్తా పద
సాక్షి, హైదరాబాద్: ‘రేవంత్.. నేను చాలెంజ్ చేస్తున్నా. సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావు కదా. పోదాం పదా..డేట్, టైమ్ మీరే చెప్పండి. నేను కారు డ్రైవ్ చేస్తా. మీరు నేను పోదాం. లేదంటే నేను రేపు 9 గంటలకు మీ ఇంటికి వస్తా. ముందు మూసీ బాధితులను కలిసిన తర్వాత మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ కట్ట మీదకు వెళ్లి నిర్వాసితులతో మాట్లాడుదాం. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. 2013 చట్టానికి మించిన ప్రయోజనాలు మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చాం ’అంటూ సీఎం రేవంత్రెడ్డి గురువారం చేసిన సవాల్పై మాజీమంత్రి టి.హరీశ్రావు ఘాటుగా స్పందించారు.‘మూసీ ఫ్రంట్ పేరిట రూ.లక్షన్నర కోట్లతో సుందరీకరణ, పునరుజ్జీవం చేస్తామని ప్రజల మధ్య ప్రకటించిన సీఎం రేవంత్ అలా ఎవరు అన్నారంటూ మాట మారుస్తున్నాడు. మెగాస్టార్లు సూపర్స్టార్లను మించి నటిస్తున్నాడు. శత్రుదేశాల మీద దాడి చేసినట్టుగా పేదల ఇళ్లపై జరుగుతున్న కూల్చివేతలను ప్రశ్నిస్తే మల్లన్నసాగర్ నిర్వాసితుల గురించి మాట్లాడుతున్నాడు’అని చెప్పారు. తెలంగాణభవన్లో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, నాయకులు పి.కార్తీక్రెడ్డి, దేవీప్రసాద్తో కలిసి హరీశ్రావు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీఎం పదవిని దిగజార్చేలా.. ‘ఎన్నికల హామీలను విస్మరించి సీఎం పదవి స్థాయిని దిగజార్చేలా రేవంత్ మాట్లాడుతున్నారు. హైదరాబాద్తోపాటు అనేక నగరాల మీదుగా అనేక నదులు ప్రవహిస్తున్నాయనే జ్ఞానం లేదు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు 4వేల ఇళ్లు ఇవ్వడంతోపాటు 2013 భూసేకరణ చట్టంలో పేర్కొన్న పరిహారం కంటే ఎక్కువే ఇచ్చాం. (పునరావాసకాలనీ ఫొటో చూపిస్తూ).. మూసీ తలంలో ఉన్న ఇళ్లు కూల్చి బాధితులకు పరిహారం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. డీపీఆర్, పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు పేరిట ఇల్లు కూల్చే అధికారం లేదు. నదితలంలో ఉన్న నిర్వాసితులకు కూడా 2013 భూ సేకరణ చట్టాన్ని వర్తింపచేయాలి.ఏఐ టెక్నాలజీ వీడియోలతో స్టంట్లు మూసీ రివర్ఫ్రంట్ పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో తయారు చేసిన వీడియోలు చూపుతూ రేవంత్ స్టంట్లు చేస్తున్నాడు. బీఆర్ఎస్ పాలనలో 31 ఎస్టీపీలతో మూసీ పునరుజ్జీవంకు ప్రయత్నాలు చేశాం. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను మూసీకి తరలించేలా వ్యాప్కోస్ సంస్థ డీపీఆర్ కూడా ఇచి్చంది. కానీ మల్లన్నసాగర్కు ప్లాన్ మార్చి కాంట్రాక్టర్లకు రూ.4వేలు లాభం చేసేలా రేవంత్ కుట్ర పన్నాడు. ఫార్మాసిటీ కోసం సేకరించిన 13 వేల ఎకరాల భూమిలో ఫోర్త్సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకుంటున్నాడు. ఫార్మాసిటీతో కాలుష్యాన్ని తగ్గించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు మూసీ పునరుజ్జీవం కూడా సాధ్యమవుతుంది. సబర్మతి నది తరహాలో గైడ్వాల్ నిర్మించి వరదలు నివారించొచ్చు. అఖిలపక్ష భేటీకి పిలవలేదు ‘నేను ఉద్యమకారుడిని, ప్రజల కోసం పోరాడేవాడిని. పదివేల కుటుంబాల్లో సంతోషం చూసేందుకు మూసీలో ఉండడానికి నేను సిద్ధం. 15 రోజుల క్రితమే మూసీ ప్రక్షాళనపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేసినా స్పందన లేదు. నాకు ఎమ్మెల్యే పదవి లేకుండానే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చిందని రేవంత్ చేసిన ఆరోపణ అర్థరహితం. నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నా శిష్యుడిగా కారు ముందు డ్యాన్స్ చేసిండు. మంత్రి పదవికి రాజీనామా చేసి గన్పార్కు వద్ద మీడియాతో మాట్లాడుతున్నప్పుడు నా వెనక ఉండి నక్కి చూసిండు’అని హరీశ్రావు ఎద్దేవా చేశారు. -
మూసీపై రేవంత్వి పచ్చి అబద్ధాలు
సాక్షి, హైదరాబాద్: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అంచనా వ్యయంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గజినీలా మారి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మూసీ సుందరీకరణ పేరిట రూ. లక్షన్నర కోట్ల ప్రజాధనం దోపిడీ ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవడంతో తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం తంటాలు పడుతున్నాడన్నారు. కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంలా మారిందని, రాహుల్గాం«దీకి డబ్బు కావాల్సినప్పుడల్లా తెలంగాణ గుర్తుకు వస్తోందన్నారు. ప్రాజెక్టు అంచనాలను రెట్టింపు చేయడంలో దిట్ట అయినందునే నిషేధిత కంపెనీ మెయిన్హార్ట్కు మూసీ డిజైన్ బాధ్యతలు అప్పగించారని చెప్పారు.మూసీ పునరుజ్జీవానికి తాము వ్యతిరేకం కాదని, వేలాది మందిని నిరాశ్రయులను చేయడానికి అంగీకరించబోమన్నారు. గరిష్టంగా రూ.25వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు పేదల కడుపు కొట్టి వేల కోట్ల రూపాయలు దోచుకునేలా రూ.లక్షన్నర కోట్లు వెచ్చిస్తే తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సమక్షంలో శుక్రవారం తెలంగాణభవన్ వేదికగా ‘మూసీ ప్రాజెక్టు’పై గంటకు పైగా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి వివరాలు కేటీఆర్ మాటల్లోనే...‘మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపైనా పునరుజ్జీవం, సుందరీకరణ, ప్రక్షాళన, నల్లగొండకు శుద్ధమైన నీరు అంటూ సీఎం రేవంత్ పూటకో మాట చెబుతున్నాడు.రెండు వేల కిలోమీటర్ల పొడవైన నమామి గంగే ప్రాజెక్టుకు రూ.40వేల కోట్లు ఖర్చయింది. 56 కిలోమీటర్ల పొడవైన మూసీ ప్రాజెక్టుకు కిలోమీటరుకు రూ.2700 ఖర్చు చేస్తామని సీఎం చెబుతున్నాడు. ప్రపంచంలో ఇంతకంటే పెద్ద కుంభకోణం మరొకటి ఉండదు. తనపై ఉన్న కేసులకు భయపడి వికారాబాద్ అడవుల్లో నేవీ రాడార్ నిర్మాణానికి రేవంత్ అనుమతి ఇచ్చారు. గతంలో మోదీ ప్రభుత్వం మెడమీద కత్తి పెట్టినా పర్యావరణ వేత్తలతో సూచనతో దామగుండం భూ అప్పగింత జీఓను అమలు చేయలేదు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ద్వారా మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, పునరుజ్జీవం కోసం రూ.16వేల కోట్లతో పేదలను నిరాశ్రయులను చేయకుండా 9 ప్రపంచ స్థాయి కన్సల్టెంట్లతో ప్రణాళికలు సిద్ధం చేశాం. మేము చేసిన పనులు చూపేందుకు శనివారం సిటీ ఎమ్మెల్యేలతో కలిసి నాగోల్కు వెళతాం. 31 ఎస్టీపీలు పూర్తయితే నల్లగొండకు స్వచ్ఛమైన నీరు వెళ్తుందనే విషయాన్ని గావుకేకలు, పెడ»ొబ్బలు పెడుతున్న నల్లగొండ మంత్రులు తెలుసుకోవాలి. గూగుల్ ఫొటోలతో ప్రజెంటేషన్ గూగుల్ నుంచి కాపీ కొట్టిన ఫొటోలతో రూ.లక్షన్నర కోట్ల ప్రాజెక్టు అంటూ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల అఫిడవిట్లో రూ.30 కోట్లు ఆస్తులు చూపించిన రేవంత్ డిజైన్లు వద్దంటే కన్సల్టెంట్లకు రూ.140 కోట్లు ఆస్తులు అమ్మి ఇస్తా అంటున్నాడు. నోటికొచ్చింది వాగి దొరికిపోవడం సీఎంకు అలవాటు. మూసీ ఒడ్డున బహుళ అంతస్తుల భవనాలు వస్తే మళ్లీ ఫోర్త్ సిటీ ఎందుకు.రీజువెనేషన్ స్పెల్లింగ్ను చూడకుండా రాస్తే ఆయనకు రూ.50 లక్షలు పట్టే బ్యాగ్ను బహుమానంగా ఇస్తా. మాపై అనేక ఆరోపణలు చేసిన సీఎం ఎందుకు విచారణ జరపించడం లేదు. మూసీ సహా అన్ని అంశాలపై అసెంబ్లీలో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా, మూక మాదిరిగా అధికార పక్షం మా గొంతు నొక్కుతోంది. ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి మీద అనుమానం ఉంది. ఆయన్ను ఆ విధంగా వదిలిపెట్టవద్దని వారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి’అని కేటీఆర్ తన ప్రజెంటేషన్ ముగించారు. -
పేపర్ చూడొద్దు.. ‘రీజువెనేషన్’ స్పెల్లింగ్ చెప్తే 50 లక్షలిస్తా..రేవంత్కు కేటీఆర్ ఆఫర్
సాక్షి,హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆఫర్ ఇచ్చారు. పేపర్ చూడకుండా.. రిజునువేషన్ స్పెల్లింగ్ చెప్తే రేవంత్రెడ్డికి రూ. 50లక్షల బ్యాగ్ గిఫ్ట్ ఇస్తాను’ అని అన్నారు. తెలంగాణ భవన్లో మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కేటీఆర్ ఏమన్నారంటే..‘ కేసుల భయంతోనే మోదీకి రేవంత్ సాగిలపడ్డారు. దామగుండం నేవీ రాడార్ స్టేషన్తో 12లక్షల చెట్లు కొట్టేస్తారు. మా హాయాంలో చేసిన పది వేల ఆర్థిక సాయంపై విచారణ జరుపుకోవచ్చు. మూసీతో పాటు.. ఆరు గ్యారంటీల అమలుపై కూడా అసెంబ్లీలో చర్చకు సిద్ధం. అసెంబ్లీ .. అసెంబ్లీలా నడవటం లేదు.. ప్రతిపక్షానికి మైక్ ఇవ్వటం లేదు.’‘పేదల కడుపుకొట్టాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. మూసీ శుద్ది చేయటాన్ని వ్యతిరేకం కాదు.. దోచుకోవటాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. కోకాపేట, ఓఆర్ఆర్ కుంభకోణాలు ఉంటే విచారణ చేసుకో రేవంత్. మూసీ ప్రాజెక్ట్ తో ఎంత భూమి సాగులోకి వస్తుంది?.రేవంత్ రూ.50 లక్షలతో దొరికి తొమ్మిదేళ్ళు అయినా శిక్ష పడలేదు.పేపర్ చూడకుండా.. రిజునువేషన్ స్పెల్లింగ్ చెప్తే రేవంత్కు రూ. 50లక్షల బ్యాగ్ గిఫ్ట్ ఇస్తాను.మాటలు మార్చి దొరికిపోవటం సీఎం రేవంత్ రెడ్డి స్పెషాలిటీ. రెడ్ కార్నర్ నోటీసులున్న పాకిస్తాన్ సంస్థకు మూసీ ప్రాజెక్ట్ ఎలా ఇస్తారు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి KTR బంపర్ ఆఫర్రేవంత్ రెడ్డి రీజువెనేశన్ అనే పదం పేపర్ చూడకుండా స్పెల్లింగ్ చెప్తే రూ.50 లక్షల రూపాయలు పట్టే కొత్త బ్యాగ్ కొనిస్తా.. ఎందుకంటే ఢిల్లీకి డబ్బులు మోయాలి కదా - KTR pic.twitter.com/m9GVxsPmoK— Telugu Scribe (@TeluguScribe) October 18, 2024 -
కేటీఆర్,హరీశ్రావులకు సీతక్క కౌంటర్
సాక్షి,హైదరాబాద్:కేటీఆర్,హరీశ్రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన పేరుతో సీఎం రేవంత్ రియల్ఎస్టేట్ చేస్తున్నారన్న కేటీఆర్,హరీశ్రావు వ్యాఖ్యలపై సీతక్క అక్టోబర్ 18(శుక్రవారం) మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ పేరుతో కేటీఆర్ ప్లాట్లు అమ్ముకున్నారు. అప్పుడు ఫ్లాట్లు అమ్ముకోవడం వల్లే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ పునర్జీవనం అని మాట్లాడినటువంటి హరీశ్రావు అది ఎక్కడ చేశారో చెప్పాలి.హరీష్ రావు ఏ చెరువుకు పునర్జీవనం పోశారో చూపించాలి. పేద ప్రజలకు న్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు.సీఎం రేవంత్ ఏం చూపించినా ఏం చేసినా పేదల కోసమే ఆలోచిస్తారు’అని సీతక్క అన్నారు.ఇదీ చదవండి: సెక్యూరిటీ లేకుండా రండి: హరీశ్రావు సవాల్ -
తెలంగాణ పరువు తీస్తున్నారు: జగదీష్రెడ్డి ఫైర్
సాక్షి,సూర్యాపేట జిల్లా: రేవంత్రెడ్డి వ్యాఖ్యలు సీఎం స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని, రాష్ట్ర ప్రజల పరువు పోయేలా ఆయన ఉపన్యాసాలుంటున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్రెడ్డి విమర్శించారు.శుక్రవారం(అక్టోబర్ 18)సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘ఎవరో రాసిచ్చిన పాఠం చదవడం రేవంత్ మానేస్తే మంచిది. తెలంగాణ ఆదాయం పెంచింది కేసీఆర్. 2014 బడ్జెట్ను ఇప్పటి బడ్జెట్ పోల్చి చూస్తే ఎవరు ఆదాయం పెంచారో తెలుస్తుంది. అప్పులు మంత్రుల జేబులో నుంచి కడుతున్నట్లు అతితెలివిగా మాట్లాడుతున్నారు.420 హామీలొద్దు. కనీసం కేసీఆర్ ఇచ్చిన పథకాలైనా ఇస్తే చాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ఆదాయం,అప్పులపై చర్చకు మేం సిద్ధమే. సెక్యూరిటీ లేకుండా సీఎం మూసీ ప్రాంతంలో తిరిగి చూపించాలి. మూసీ కూల్చివేతల తర్వాత సెక్యూరిటీ పెంచుకుని ప్రగల్భాలు పలుకుతున్నారు. అశోక్ నగర్ పేరు వింటే రేవంత్కు భయమేస్తోంది. సీఎం ఏకపక్షంగా వెళుతున్నారని కాంగ్రెస్ సీఎంలే అంటున్నారు.ఇదీ చదవండి: మెగాస్టార్,సూపర్స్టార్ను మించిన నటుడు రేవంత్: హరీశ్రావు -
మూసీ సుందరీకరణపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మూసీ సుందరీకరణ అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేదల ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే, మూసీ నదిలో డ్రైనేజీలు కలవకుండా చూడాలన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మూసీ సుందరీకరణ చేసినా పునర్జీవం చేసినా మేం వ్యతిరేకం కాదు. మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టండి. డ్రైనేజీ మూసీలో కలవకుండా చూడండి. పేదల ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయవచ్చు. ఆ తర్వాత మూసీ పునర్జీవం చేయండి. రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థుల న్యాయ బద్ధమైన సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ వ్యతిరేకం. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణలో ఇంకా వ్యతిరేకత ఉంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సీట్లే ఇవ్వలేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: పనికిమాలిన మాటలు.. పాగల్ పనులు: కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్ -
కేటీఆర్ అతి తెలివి ప్రదర్శించొద్దు: గుత్తా
సాక్షి, నల్గొండ: కేటీఆర్ అతి తెలివి ప్రదర్శిస్తున్నాడంటూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 50 అంతస్తుల భవనాలకు ఎవరు అనుమతి ఇచ్చారు? అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలన్నీ బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని.. ఎవరేం పాపాలు చేశారో వారి ఆత్మలకు తెలుసు. ఒకసారి పరిశీలన చేసుకోవాలంటూ గుత్తా వ్యాఖ్యానించారు.‘‘మూసీ ప్రక్షాళనకు వాజ్పేయ్ హయాంలోనే బీజం పడింది. కేసీఆర్ కూడా మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ఏర్పాటు చేశారు. సుందరీకరణ పేరుతో రేవంత్ దోచుకుంటున్నారనడం తగదు. నల్లగొండ జిల్లా ప్రజలు బాగుపడాలంటే మూసీ ప్రక్షాళన జరగాలి. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాల రాద్ధాంతం సరికాదు’’ అని గుత్తా హితవు పలికారు.అత్యుత్సాహం ప్రదర్శించొద్దు. అలా ప్రదర్శిస్తే మొన్నటి ఎన్నికల్లో ఏమైంది? మీ స్వార్థం కోసం ౫౦ అంతస్తుల భవనాలకు అనుమతి ఇచ్చి ఇబ్బందులకు గురిచేశారు. మీరు చేస్తే సుందరీకరణ అవతలోడు చేస్తే దోచుకోవడమా? రూ. 16500 కోట్లతో మూసీ సుందరీకరణ కు ప్రతిపాదనలు చేసింది బీఆర్ఎస్ కాదా? దేశభద్రత కు ఉపయోగపడే రాడార్ ఏర్పాటు విషయంలో కూడా విమర్శలేనా?. రాడార్ విషయంలో జీవోలు ఇచ్చింది బీఆర్ఎస్ కాదా?’’ అంటే గుత్తా సుఖేందర్రెడ్డి ప్రశ్నలు గుప్పించారు.మూసీ ప్రక్షాళన కోసం ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రక్షాళన వద్దని చెప్పే పార్టీలకు గుణపాఠం చెప్పాలి. మూసీ పరివాహక ప్రాంతాల్లో నోరు తెరిస్తే దోమలే లోపలికి పోతాయి. నది గర్భంలో ఉన్న ఇళ్లను తొలుత తొలగించాలి. యాభై అంతస్తులు కట్టే వారంతా మట్టిని తవ్వి మూసీలోనే పోస్తున్నారు. అక్రమ నిర్మాణాల వల్ల జరిగే నష్టం, సెల్లార్లలో తీసిన మట్టి ఎటుపోతుందనేది కూడా హైడ్రా దృష్టి పెట్టాలి’’ అంటూ గుత్తా సూచించారు. -
మూసీపై సీఎం తీరు అర్థరహితం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు అర్థరహితంగా ఉందని బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలపై శుక్రవారం కీలక ప్రజెంటేషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తెలంగాణ భవన్లో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని తెలిపింది. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లను ప్రతిపాదించి, చాలా వరకు పూర్తి చేసినట్లు కేటీ రామారావు పలు సందర్భాల్లో వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు ఎస్టీపీల నిర్మాణ పనులను ఇటీవల కేటీ రామారావు పార్టీ ఎమ్మెల్యేలతో కలసి సందర్శించారు. -
సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం!: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్:‘అధికారం కోల్పోయి నిస్పృహ, అసహనంతో మూసీ నది పునరుజ్జీవానికి కొంతమంది అడ్డుపడుతున్నారు. మూసీ సుందరీకరణ అనే డైలాగ్ను ప్రచారంలోకి తెచ్చారు. మేము అందాల కోసం పని చేయడం లేదు. అందాల భామలతో కలిసి పనిచేయడం లేదు. అలాంటి కొంతమంది.. మంత్రులు, ప్రజాప్రతినిధుల ముసుగులో పదేళ్లు రాష్ట్రాన్ని పట్టిపీడించి బందిపోటు దొంగలకంటే దుర్మార్గంగా పట్టపగలు దోపిడీ చేసి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మూసీ పునరుజ్జీవన ప్రయత్నాలపై విష ప్రచారంతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. మూసీ మురికిని మించి మెదడులో విషం నింపుకుని తెలంగాణ సమాజంపై దాడి చేస్తున్నారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. గురువారం సచివాలయంలో మంత్రులు డి.శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక్కొక్కరిని ఒప్పించి తరలిస్తాం ‘ఇది సుందరీకరణ కాదు.. దుబాయ్కి వెళ్లి నెత్తిమీద జుట్టును నాటు వేయించుకున్న విధానం కాదు. పునరుజ్జీవంతో మూసీని, మురికిలో కాలం వెళ్లదీస్తున్న ప్రజలను కాపాడి మంచి జీవనాన్ని ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, ప్రత్యామ్నాయ ఇళ్లను ఇవ్వాలనే ఆలోచన మాకు ఉంది. కానీ పేదరికం, కట్టుబానిసలు ఉండాలనే దొరలు, భూస్వాములు, జమీందారుల భావజాలం ఉన్నవారు దీనికి అడ్డుపడుతున్నారు. అక్కడి ప్రజల భవిష్యత్తుపై అపోహలు సృష్టిస్తున్నారు. నిజానికి 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించగల కార్యాచరణ ఇది. గత 10 నెలల పాటు అధికారులు 33 బృందాలుగా ఏర్పడి మూసీ దుర్గంధంలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న ప్రతి ఇంటికీ వెళ్లి వారి కష్టాలు, వివరాలను తెలుసుకున్నారు. వారిని ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై మేం ఆలోచన చేస్తున్నాం. అక్కడి సమస్యలు పరిష్కరించి ఒక్కొక్కరిని ఒప్పించి తరలిస్తాం..’ అని సీఎం స్పష్టం చేశారు. సెక్యూరిటీ లేకుండా వస్తా..మీరూ రండి ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ భూసేకరణ కోసం వేములఘాట్ ప్రజలపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించి గుర్రాలతో తొక్కించినట్టుగా మేం చేయం. ఇక్కడికి వస్తావా? అక్కడికి వస్తావా? అని నన్ను అడుగుతున్నారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, గజ్వేల్లోని ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మకు నేను సెక్యూరిటీ లేకుండా వస్తా. బీఆర్ఎస్ నేతలూ రావాలి. రచ్చబండ నిర్వహించి పదేళ్లలో ఎన్ని దుర్మార్గాలు చేశారో ప్రజలను అడుగుదాం..’ అని రేవంత్ సవాల్ చేశారు. బఫర్ జోన్లో మరో 10 వేల గృహాలు ‘మూసీ గర్భంలో 1,690 ఇళ్లు ఉండగా వారికి దసరా పండుగ వేళ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు రూ.25 వేలు చొప్పున తోవ ఖర్చులకు ఇచ్చాం. అయితే హైడ్రా వస్తుంది..బుల్డోజర్లు పెడ్తున్నరు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీలో ప్రభుత్వం ఒక్క ఇల్లు కూలగొట్టలేదు. ఖాళీ చేసిన లబ్ధిదారులే తమ ఇళ్ల తలుపులు, కిటికీల కోసం కూలగొట్టుకున్నారు. అడ్డగోలుగా కట్టిన 10, 20 అంతస్తుల ఆకాశహర్మ్యాలను కూల్చడానికే బుల్డోజర్లు, హైడ్రా అవసరం. అయినా హైడ్రా ఏమైనా ఫామ్హౌస్లో నిద్రపోయే భూతమా? మీద పడడానికి? మరో 10 వేల ఇళ్లు బఫర్జోన్లో ఉన్నాయి వారికి ప్రత్యామ్నాయం కల్పించి, మంచి జీవితాలు ఇచ్చి మనస్సు గెలవాలని భావిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. అద్భుతాలు సృష్టించిన కంపెనీలతో కన్సార్టియం ‘ప్రపంచంలో అద్భుతాలను సృష్టించిన ఐదు కంపెనీలతో ఒక కన్సార్టియం ఏర్పాటు చేయించి రూ.141 కోట్లతో మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతలను టెండర్ల ద్వారా అప్పగించాం. డీపీఆర్ తయారీతో పాటు అంచనా వ్యయం, నిధులు, పెట్టుబడులు, రుణాల సమీకరణకు సంబంధించి కన్సార్టియం సహకారం అందిస్తుంది. 18 నెలల్లో డీపీఆర్ తయారు చేస్తారు. ఆ తర్వాత నాలుగైదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఆరున్నరేళ్ల పాటు కన్సార్టియం సేవలందిస్తుంది. ఈ కన్సార్టియంలో భాగమైన ‘మీన్హార్ట్’ కంపెనీకే ప్రధాని మోదీ గుజరాత్లో సర్దార్ పటేల్ విగ్రహం కట్టే బాధ్యత అప్పగించారు. అలాగే రాష్ట్రంలో కేసీఆర్, రామేశ్వర్రావు తమ కులగురువు చినజీయర్స్వామితో కలిసి సమతామూర్తి విగ్రహాన్ని కట్టే బాధ్యత అప్పగించారు. గత ప్రభుత్వం ఉప్పల్లో మూసీపై రూ.30 కోట్లతో పనులు ప్రారంభించి రూ.6 కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డుల్లో ఉంది. కానీ వర్షం వచ్చి చేసిన పనికొట్టుకుపోయిందని అంటున్నారు. ఈ వ్యవహారంలో లోపల వేయవచ్చు. చర్లపల్లి జైల్లో వేస్తే తిండిదండగ అని మేం చూసీచూడనట్టుగా ఉంటే వారికి అలుసుగా ఉంది..’ అని రేవంత్ అన్నారు. ‘మూసీ’పై అసెంబ్లీలో చర్చకు సిద్ధం ‘మూసీ ఒడ్డున ఖాళీ చేసిన ఇళ్లల్లో హరీశ్, కేటీఆర్, ఈటల రాజేందర్ మూడు నెలలు ఉంటే ఈ ప్రాజెక్టును ఆపేస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. ప్రజలు అక్కడ ఉండడం అద్భుతం అనుకుంటే మీరూ ఉండండి. పునరుజ్జీవాన్ని అడ్డుకోవడం మాత్రం దేశద్రోహం. మంచి ప్రాజెక్టుగా భావిస్తే ప్రజలను తరలించడానికి ఏం చేయాలో సూచనలు చేయండి. దీనిపై అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధం. ఇళ్లు, ఉద్యోగం, ఉపాధి, ప్లాట్, నష్టపరిహారం ఇద్దామా? చెప్పండి. అనుమానాలుంటే నివృత్తి చేస్తాం ప్రత్యేక కేసుగా ఎంపీలను ఎంక్లోజర్లో పెట్టి శాసనసభలో మాట్లాడించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అసద్, కిషన్, కేసీఆర్ తమ అనుమానాలను శనివారంలోగా ప్రశ్నల రూపంలో తెలియజేస్తే రాతపూర్వకంగా సమాధానమిస్తాం. రాజకీయ సమ్మతి కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం..’ అని సీఎం తెలిపారు. దామగుండాన్ని వ్యతిరేకించేవాళ్లు కసబ్ లాంటోళ్లు ‘దేశ భద్రత కోసం ఏర్పాటు చేసే దామగుండం నేవీ రాడార్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడేవాళ్లు కసబ్లాంటి వాళ్లు. కేటీఆర్ కసబ్లాగా మాట్లాడితే ఎవడో వచ్చి ఇవ్వాల్సిన సమాధానం ఇస్తాడు. ఏటా రూ.500 కోట్ల లంచం వచ్చే బతుకమ్మ చీరలను నిలుపుదల చేస్తే కడుపు మండి ఆరోపణలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో వరద బాధితులకు రూ.10 వేలు చొప్పున గత ప్రభుత్వం చేసిన రూ.600 కోట్ల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశించాలా?..’ అని కేటీఆర్ను ఉద్దేశించి రేవంత్ ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడటానికి ముందు.. ప్రస్తుతం మూసీ నది ఎలా ఉంది? పునరుజ్జీవం తర్వాత ఎలా ఉండబోతోంది తెలియజేస్తూ సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు. -
‘అద్దాల మేడలు, అందమైన భామల కోసం మేం పని చేయడం లేదు’
సాక్షి,హైదరాబాద్: మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాం. ‘అద్దాల మేడల కోసం అందమైన భామల కోసం మేం పనిచేయడం లేదు’ అంటూ సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ నదీ ప్రక్షాళనపై సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 33మంది అధికారుల బృందం పనిచేసింది.పేదలతో ఎదుర్కొంటున్న ప్రజల సమస్యల్ని విన్నారు.మూసీపై 10 నెలలుగా అధికారులు సీరియస్గా పనిచేస్తున్నారు.మూసీ పునరురజ్జీవనం కోసం మేం ప్రయత్నిస్తున్నాం.మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఆదుకోవడం ఎలా అనేదానిపై దృష్టి పెట్టాంమూసీ సుందరీకరణను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.ప్రజల్లో అపోహాలు సృష్టిస్తున్నారుబ్యూటిఫికేషన్ మీద విష ప్రచారం చేస్తున్నారుమూసీ కంటే బీఆర్ఎస్ నేతల మొదళ్లలో ఉంది.ఇప్పుడు ప్రజల్లో అపోహలు కల్పించి విషప్రచారం చేస్తున్నారు.మూసీ 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాం10ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. రాష్ట్రాన్ని బందిపోటు దొంగల్లా దోచుకున్నారు.మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాంఅద్దాల మేడల కోసం... అందమైన భామల కోసం మేం పనిచేయడం లేదుమూసీ 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుందిబఫర్ జోన్లో 10వేల ఇళ్లు ఉన్నాయిమూసీ బాధితులను ఆదుకోవడం కోసమే ఈ ప్రాజెక్ట్మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాంచెన్నై ముంబైలాంటి నగరాల్లో వరదలు ఎలా ఉన్నాయి?చెన్నై,ముంబై నగరాల్లో ఏం జరుగుతుందో కనపడతలేదా?చెరువులు,నాళాలు ఆక్రమించారు. మూసీ పరిస్థితి ఏంటి?నగరాన్ని మూసీలో ముంచదల్చుకున్నారా?హైదరాబాద్ మహానగరాన్ని ఏం చేయదలుచుకున్నారు?వద్దంటే చెప్పండి మూసీ టెండర్లు రద్దు చేస్తాంనాకు స్వార్థం ఉన్నట్లు మమ్మల్ని విమర్శిస్తున్నారుఅధికారం కోల్పోయిన వారు ప్రతీది అడ్డుకోవాలని చూస్తున్నారుమూసీ విషం హైదరాబాద్లోనే కాదు నల్గొండకు వెళ్తుందిఖమ్మం,విజయవాడ కళ్లముందే వరదల్లో మునిగిపోయింది.హైదరాబాద్ను కూడా అలాగే ముంచాలనుకుంటున్నారా?నల్గొండ ప్రజలు మౌనంగా ఉంటే ఎలా? ఇది మూసీ సుందరీకణ కాదు, పునరుజ్జీవన ప్రాజెక్టుమూసీ పునరుజ్జీవంపై కొంతమంది అపోహాలు సృష్టిస్తున్నారుహైదరాబాద్లోని అద్భుత కట్టడాలను నాశనం చేయాలని చూస్తున్నారుహైదరాబాద్ సర్వనాశనం అవుతుంటే మీకు రాజకీయాలే ముఖ్యమా?హైదరాబాద్ను అద్భుతంగా తీర్చిదిద్దడానికి డీపీఆర్ కోసం.. ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలను కన్సార్టియంగా మార్చాందీనిపై అందురు ఒప్పుకుంటేనే ముందుకుపోదాం, లేదంటే వద్దుమూసీకి వెళ్తామంటున్న నేతలు అక్కడ మూడు నెలలు ఉండండికేటీఆర్,హరీష్రావు,ఈటలకు మూసీలో ఇళ్లు ఇస్తాంమూసీ అద్భుతంగా ఉంటే అక్కడే మూడు నెలలు ఉండండిమూసీలో కేటీఆర్,హరీష్,ఈటల మూడునెలల ఉంటే ప్రాజెక్ట్ ఆపేస్తాందేశ భద్రత విషయంలో రాజీపడందేశ భద్రత విషయంలో రాజీపడేది లేదురాడార్ స్టేషన్ కు గత ప్రభుత్వం లోనే అన్ని అనుమతులు ఇచ్చారు.రాడార్ స్టేషన్ వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్.. బతుకమ్మ చీరల విషయంలో గగ్గోలు పెడుతుందిహైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు.. గ్రౌండ్ ఫ్లోర్ వాల్లకు డబ్బులు ఇవ్వలేదు..5వ అంతస్తు వాల్లకు ఇచ్చారుదీనిపై ఏంక్వరీకి సిద్దమా.. సిద్దమైతే 24 గంటల్లో ఏసీబీ ఏంక్వరీకి ఆదేశిస్తా.. -
తొలిసారే ఈ గడ్డు పరిస్థితులు.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటునున్నామని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అనేకమంది విద్యార్థులను బీఆర్ఎస్ నాయకులుగా చేసింది.పార్టీ పెట్టిన తర్వాత మెదటిసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. సీఎం రేవంత్రెడ్డి పదవినికి కాపాడుకునే పనిలో ఉన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేస్తోంది. పోరాటాలు మనకు కొత్త కాదు. రాజకీయ ఉద్దండులతోనే మన పార్టీ కొట్లాడింది. ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలతో నష్టం చేస్తున్నారు. తమకు అండగా నిలవాలని గ్రూప్-1 అభ్యర్థులు కోరారు. జీవో 55ను రద్దు చేసి జీవో 29ని తీసుకొచ్చారు. స్థానికులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు. దేశంలో జోనల్ వ్యవస్థ ద్వారా 95శాతం స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా కేసీఆర్ చేశారు.తెలంగాణలో ఉన్న గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడా లేవు.రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రజలు తెలంగాణ భవన్కు వస్తున్నారు. 12వేల మంది ఆశా వర్కర్లతో పెద్ద సభ నిర్వహిస్తాం. కేసీఆర్ ఇచ్చిన జీవో 55ను రద్దు చేసి జీవో 29ను తెచ్చారు. జీవో 29వలన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోంది.నవంబర్ 5న జరిగనున్న ఆటో డ్రైవర్ల ధర్నాకు మద్దతు ఇస్తాం. కాంగ్రెస్ పాలనలో భాదపడని వారు లేరు. సిద్ధిపేటలో ఒకే ఇంట్లో నలుగురికి మెడికల్ సీట్లు వచ్చాయి. హరీష్ రావు కుట్రతోనే నలుగురికి మెడికల్ సీట్లు వచ్చాయని రేవంత్ రెడ్డి అనుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరంకాదు. తెలంగాణను నాశనం చేస్తుంటే బీజేపీ ఎందుకు మాట్లాడదు?కవితను అక్రమంగా ఐదు నెలల్లో జైల్లో పెట్టారు. బీఆర్ఎస్ కాంగ్రెస్,బీజేపీ రెండు పార్టీలు ప్రత్యుర్థులే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. అందరికి అవకాశాలు వస్తాయి’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
హైడ్రా ఒక డ్రామా.. అవన్నీ అక్రమ నిర్మాణాలు కావు: ఈటల
సాక్షి, హైదరాబాద్: హెడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం రేవంత్పై మరోసారి మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. బఫర్ జొన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉండేవి మొత్తం ప్రభుత్వ భూములు కావని, పట్టా భూములు కూడా ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తున్నవి అన్ని అక్రమ నిర్మాణాలు కావని, హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు.కాగా గతంలోనూ బుల్డోజర్లతో ఇళ్లను కూలగొట్టి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఈటల విమర్శించారు. కేవలం పేదలనే టార్గెట్ చేసి ప్రభుత్వం హీనంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు శని, ఆదివారాల్లో కోర్టులు అందుబాటులో ఉండవని కూల్చివేతలు చేస్తున్నారని అన్నారు. చెరువులు కాపాడాలంటే ముందు ప్రభుత్వ, ప్రయివేటు భూములు లెక్కించాలని డిమాండ్ చేశారు. కూల్చివేతలతో రోడ్డున పడ్డ పేదలకు తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుమ్ములాటలు ఉన్నాయని, అవి బయటపడకుండా ఉండేందుకు హైడ్రా పేరుతో డైవర్షన్ చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల భూములు లాక్కోవడానికి రేవంత్ రెడ్డి జాగీరు కాదన్నారు. చెరువులు, వాగుల రక్షణ కోసం అవసరమైతే భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
పైసా పనిలేదు.. రూపాయి లాభం లేదు: రేవంత్ ఢిల్లీ టూర్లపై కేటీఆర్
సా క్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు సంధించారు. పది నెలల్లో 25 సార్లు, 50 రోజులు ఢిల్లీకి పోయివస్తివి అంటూ ధ్వజమెత్తారు. పోను 25 సార్లు, రాను 25 సార్లు.. నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్జూబ్లీ కూడా చేస్తివని ఎద్దేవా చేశారు. తట్టా మట్టి తీసింది లేదు, కొత్తగా చేసింది అసలే లేదంటూ విమర్శించారు. అన్నదాతలు అరిగోసలు పడుతున్నారని, గురుకులాలు గాల్లో దీపాల్లా మారాయని, వైద్యం కుంటుపడిందని, విద్యావ్యవస్థ గాడి తప్పిందన్నారు.మూసి, హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టారని, 420 హామీలను మడతపెట్టి మూలకు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగలు పండగళ్లా లేవని, ఆడబిడ్డలకు చీరలు అందనేలేవని, అవ్వాతాతలు అనుకున్న పింఛను, తులం బంగారం జాడే లేదని ఫైరయ్యారు. స్కూటీలు, కుట్టు మిషిన్లు లేనేలేవని, అయినా ఢిల్లీకి పోయిరావాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు.✳️ పైసా పనిలేదు - రాష్ట్రానికి రూపాయి లాభం లేదు10 నెలలు - 25 సార్లు - 50రోజులుపోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి. తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదు ❌ అయినను పోయి రావాలె హస్తినకు✳️…— KTR (@KTRBRS) October 17, 2024 -
రేవంత్ బుల్డోజర్లకు బీఆర్ఎస్ అడ్డుపడుతుంది
సాక్షి, హైదరాబాద్: హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట ప్రభు త్వం సృష్టిస్తున్న భయానక వాతావరణం నుంచి ప్రజలను బీఆర్ఎస్ రక్షిస్తుందని, సీఎం రేవంత్ బుల్డోజర్లకు అడ్డుగా నిలబడుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. మూసీ పేరిట జరుగు తున్న లూటీని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు హైదరాబాద్ పేదలకు బీఆర్ఎస్ రక్షణ కవచంలా నిలుస్తుందని అన్నారు. పెద్ద పెద్ద బిల్డర్లను బెది రించేందుకే హైడ్రాను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. పేదలను బెదిరింపులకు గురిచేస్తున్న ప్రాంతాల్లో త్వరలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పర్యటించి అక్కడి ప్రజలకు భరోసా కల్పిస్తారని తెలిపారు. ఈ మేరకు షెడ్యూలును త్వర లోనే ప్రకటిస్తామన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.పేదలకు ఎవరూ అండగా లేరనుకుంటోంది..‘పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలకు ఎవరూ అండగా లేరనే రీతిలో ప్రభుత్వం అనాలోచితంగా, ప్రణాళిక లేకుండా దూకుడుగా వ్యవహరిస్తోంది. 50 ఏళ్ల క్రితం అనుమతులు పొందిన ఇళ్లను కూడా కూల్చివేస్తామంటే కుదరదు. మా ఫార్మ్హౌస్లు చట్టవిరుద్ధంగా ఉంటే కూల్చండి కానీ పేదల జోలికి వెళ్లొద్దు. హైడ్రా బాధితుల తరఫున న్యాయ పోరాటం చేసేలా బీఆర్ఎస్ లీగల్ సెల్ను బలోపేతం చేస్తాం..’ అని కేటీఆర్ తెలిపారు.మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు?‘మా ప్రభుత్వంలో మూసీ మురుగునీటిని వంద శాతం శుద్ధి చేసేందుకు రూ.4 వేల కోట్లతో ఎస్టీపీలను నిర్మించాం. రూ.1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు గోదావరి నీళ్లు తేవడంతో పాటు నల్లగొండకు మంచినీళ్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. అలాంటపుడు మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు? ఒకపక్క మూసీ సుందరీకరణ అంటూనే దామగుండం రాడార్ స్టేషన్ పేరిట 12 లక్షల వృక్షాలను ఎలా నరికేస్తారు? బీజేపీ కంటే ఎక్కువ రేవంత్ మాట్లాడుతున్నాడుదేశ రక్షణ విషయంలో బీజేపీ నాయకులకంటే ఎక్కువగా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నాడు. దేశ రక్షణకు బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది. 2017లో దామగుండం రాడార్ స్టేషన్ కోసం జీవో ఇచ్చినా పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుని జీవోను తొక్కి పెట్టాం. ప్రధానిని ప్రశ్నించాలంటే రేవంత్కు భయం. గతంలో కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగినా సీఎం మాట్లాడలేదు..’ అని కేటీఆర్ విమర్శించారు.పది నెలల్లో రికార్డు స్థాయిలో అప్పులు‘అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రేవంత్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.80,500 కోట్లు అప్పు చేసింది. అప్పు తప్పు అని గతంలో ఆరోపించిన వారిని ఇప్పుడు దేనితో కొట్టాలి? రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా వేయకుండా, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా, నెలల పాటు జీతాలు ఇవ్వకుండా రూ.80 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?’ అని మాజీమంత్రి నిలదీశారు. -
వరంగల్ కాంగ్రెస్లో పవర్ వార్..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్లో ముసలం మొదలైంది. అధికారంలోకి వచ్చి ఏడాదైనా గడవకుండానే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం వేదికగా పార్టీలో అంతర్గత లుకలుకలు ప్రారంభమయ్యాయి. జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖపై హను మకొండ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే పార్టీకి ఫిర్యాదులు చేయడం గమనార్హం. పరకాల నియోజకవర్గంలో ఇప్పటికే కొండా సురేఖ, ఎమ్మె ల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిల మధ్య విభేదాలు బహిర్గతం కాగా, ఇప్పుడు పార్లమెంటు పరిధిలోని మిగిలిన ఎమ్మెల్యేలు కూడా జత కలిశారు.మంత్రి సురేఖ తమ నియోజ కవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, తమకు నష్టం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారంటూ వీరంతా పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి వినతిపత్రం అందజేశారని, తమ నియోజకవర్గాల్లో కలుగజేసుకోకుండా మంత్రి సురేఖను నియంత్రించాలని కోరారని తెలుస్తోంది. దీనికి ముందు మంగళవారం రాత్రి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీని కూడా కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేయడం గమనార్హం. వివాదాస్పదమవుతున్న సురేఖ వ్యవహార శైలిరాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలి ఇటీవలి కాలంలో వివాదాలకు దారితీస్తోంది. సినీ నటుడు నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డితో వివాదం పార్టీకి తలనొప్పిగా మారింది. వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఇతర ఎమ్మెల్యేలతో సైతం సఖ్యత కొరవడటం తాజాగా చర్చనీయాంశమవుతోంది. దీంతో సురేఖ విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆసక్తి కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో నెలకొంది. ఇటీవలి పరిణామాలు ఆమె భవితవ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దివాలా తీసింది
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసిందని అన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్. బుధవారం హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ ఉల్లంగిస్తే చర్యలు తప్పవు. ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదు. పార్టీ లైన్లో పని చేయాల్సిందేనని ఆదేశించారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసింది. కానీ కాంగ్రెస్ అలా కాదు.. అధికారంలోకి వచ్చాక 10 నెలల కాలంలో అనేక అద్భుతమైన పనులు చేసింది.. అటు రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టింది. ఇచ్చిన హామీలను నెరవేర్చింది. గ్రేటర్ ఎన్నికల్లో ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తారంగా తీసుకెళ్లాలి. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాలి. మనం గట్టిగా పనిచేస్తేనే ప్రజల్లోకి వెళ్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చరిత్ర సృష్టించింది. ప్రభుత్వం చేస్తున్న పనులను నాయకులు లోతుగా అధ్యయనం చేయాలి.. అర్థం చేసుకోవాలి. ప్రజల్లో మంచి స్పందన ఉంది.ప్రతి పక్ష బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి పోయాయి.. రెండు పార్టీ లు కలిసి కాంగ్రెస్ను దెబ్బతీయాలని చూస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ కుట్రల్ని మనం తిప్పికొట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున గ్రేటర్ లో విజయం సాధిస్తేనే మనకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ జిల్లా నాయకులు పకడ్బందీగా పని చేసి ఫలితాలు సాధించాలి’అని బి.మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. -
TG: ప్రభుత్వంపై హరీశ్రావు ఫైర్
సాక్షి,హైదరాబాద్:ఉన్న పథకాలు బంద్ పెట్టడమే తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్లో బుధవారం(అక్టోబర్ 16) మీడియాతో హరీశ్రావు చిట్చాట్గా మాట్లాడారు.‘ఒక చీర కాదు..రేవంత్ రెడ్డి రెండు చీరలు అన్నాడు.దసరా పండుగకు అక్క చెల్లెళ్ళను ప్రభుత్వం నిరుత్సహపరిచింది.రూ.15వేలు రైతుబంధు అన్నాడు..గుండు సున్నా చేశాడు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని పేద గర్బిణి స్త్రీలను మోసం చేశాడు.ముదిరాజ్,గంగపుత్రులంటే సీఎం రేవంత్కు చిన్నచూపు.ఆగస్టులో పోయాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వచ్చినా పోయలేదు.మేం రూ. 100కోట్లు ఖర్చు చేస్తే..కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల కోసం బడ్జెట్లో పెట్టిందే రూ.16కోట్లు.ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు’అని ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రా -
బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రా: కేటీఆర్
సాక్షి, తెలంగాణభవన్: హైడ్రాను అడ్డు పెట్టుకుని బిల్డర్లు, వ్యాపారవేత్తల నుంచి రేవంత్ సర్కార్ వసూళ్లకు పాల్పడుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే, సీఎం రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రినా? లేక బీజేపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ దిక్కుమాలిన పాలన వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.నేడు తెలంగాణభవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణభవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రాను తీసుకువచ్చారు. వసూళ్ల కోసమే రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా పేరుతో వసూలు జరుగుతున్నాయని ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ నేతలను కొట్టారు. అఖిలపక్షం సమావేశం కాదు.. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలతో మీటింగ్ పెట్టాలి. పార్టీల అభిప్రాయాలు కాదు.. ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. మూసీ సుందరీకరణ వెనుక భారీ కుంభకోణం ఉంది.అక్రమ నిర్మాణమైతే.. నా ఫాంహౌస్ను కూల్చేయండి. పేదల కడుపు కొట్టకుండా మూసీ సుందరీకరణ చేసుకోవచ్చు. మూసీకి పురిట్లోనే గండి కొట్టి.. హైదరాబాద్ వచ్చి సుందరీకరణ అంటున్నారు. దామగుండం నేవీ రాడార్ స్టేషన్స్కు అమెరికా, యూకే లాంటి దేశాలు వాడటం లేదు. పర్యావరణ ప్రేమికుల సూచన మేరకు కేబీఆర్ పార్క్ చుట్టూ ప్లై ఓవర్స్ ఆలోచనను విరమించుకున్నాం. సీఎం రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రినా? లేక బీజేపీలో ఉన్నారా?. ఉన్నట్టుండి రేవంత్కు దేశరక్షణ గుర్తొచ్చింది. గతంలో ఆర్మీలో ఏమైనా రేవంత్ పనిచేశాడా?.మూసీ నది పరివాహక ప్రజలకు 50 ఏండ్ల కిందట ప్రభుత్వమే పట్టాలిచ్చి రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చింది. వారి చేత నల్లా బిల్లు, కరెంట్ బిల్లు కట్టించుకుంది. మూసీ సుందీరకరణ, హైడ్రా ఏదైనా కావొచ్చు.. ఏదైనా సరే.. నిర్దిష్టమైన ఆలోచన, పద్ధతి, ప్రణాళిక లేదు. మూసీ పేరిట జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉందో దాన్ని వివరంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. దిక్కుమాలిన పాలన వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. సీఎం దివాలాకోరు మాటల వలనే అప్పు పుట్టడం లేదని మంత్రి తుమ్మల గుర్తుంచుకోవాలి. రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డంగా ఉంటారు. కాంగ్రెస్ హయాంలోనే అనుమతిలిచ్చి.. ఇప్పుడు కూల్చుతున్నారని డిప్యూటీ సీఎంకు తెలియదా?. మోదీని చూస్తే.. రేవంత్ రెడ్డికి హడల్. సంక్షేమ పథకాలకు లేని నిధులు హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బులు ఎక్కడివి?’ అంటూ ప్రశ్నించారు. -
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ పరిశీలకులుగా తెలంగాణ మంత్రులు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది.మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మందిని నియమించగా.. వీరిలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క ఉన్నారు. ఝార్ఖండ్కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు తారిక్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిని నియమించారు.కాగా మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు ఒకే దశలో, జార్ఖండ్కు రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 20న మహారాష్ట్రకు, నవంబర్ 13న, 20న జార్ఖండ్కు ఎన్నికలు జరగనున్నాయి.