breaking news
-
కేటీఆర్పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల అంశంపై ఈఆర్సీ వద్దకు కేటీఆర్ వెళ్ళడం ఒక పెద్ద జోక్ అని, ఆయన ఒక జోకర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంగళవారం(అక్టోబర్22) మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ‘పార్లమెంట్లో ఒక్క సీటు రాకున్నా,అసెంబ్లీలో ఓడించినా కేటీఆర్కు బుద్ధి రాలేదు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటును పేదవాళ్ళకు మా ప్రభుత్వం ఇస్తోంది. కేంద్ర మంత్రులు సంజయ్,కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కి ఎంత నిధులు తెచ్చారు’అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.పార్లమెంట్ సెంట్రల్హాల్ తరహాలో అసెంబ్లీ..‘రూ.49కోట్ల అంచనాతో అఘాఖాన్ ట్రస్ట్ అసెంబ్లీని ఆధునికీకరిస్తోంది. ఈ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నిజాం తరహాలో ఎలా కట్టారో అలా మార్పులు చేస్తున్నారు.పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహలో అసెంబ్లీ,కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు వెళ్లాలంటే వెహికిల్లో సీఎం మంత్రులు వెళ్లాల్సి వస్తుంది. రెండూ ఒకే దగ్గర ఉంటే టైం సేవ్ అవుతుంది’అని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. -
కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. ఇదొక గుణపాఠం కావాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వదిలిపెట్టేది లేదంటూ.. కొండా సురేఖపై పరువు నష్టం దావా అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పిరికిపందల మాదిరి తన వ్యక్తిత్వంపైన ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్న కేటీఆర్.. ఇలాంటి నీచమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా బలమైన స్టాండ్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు.ఇప్పటిదాకా ఇలాంటి వ్యాఖ్యలను వదిలిపెట్టినా, ఇక పైన మీడియా, సోషల్ మీడియాలో చేసే ఇలాంటి నీచమైన ప్రచారాన్ని వదిలిపెట్టేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ప్రజల తాలూకు అంశాలకే తాను ప్రాధాన్యత ఇచ్చాను. ఇతరులపై వ్యక్తిగత ఆరోపణలు, నీచమైన వ్యాఖ్యలు ఏనాడూ చేయలేదు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నీచమైన వ్యాఖ్యలు చేస్తామంటే ఊరుకునేది లేదు’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు.రాజకీయ విమర్శలపేరు చెప్పి, ఎలాంటి ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసే వారికి కొండా సురేఖపై వేసిన రూ. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఒక గుణపాఠం కావాలి. న్యాయస్థానాల్లో సత్యం గెలుస్తుందన్న నమ్మకం నాకున్నది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి ఝలక్ -
మూసీపై సీఎంది పూటకోమాట: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: మూ సీ నది ప్రక్షాళనపై ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి పూటకోమాట మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ‘ఎ క్స్’ వేదికగా విమర్శించారు. మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి కోసం రూ. 1.50 లక్షల కోట్ల ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జూలై 20న సీఎం ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. అలాగే సెప్టెంబర్ 6న సీఎం విడుదల చేసిన ‘తెలంగాణ గ్రోత్ స్టోరీ: దిరోడ్ టు వన్ ట్రిలియన్ డాలర్ ఎకాన మీ’ అనే విజన్ డాక్యుమెంట్లోనూ ఇదే విష యాన్ని పొందుపరిచారని పేర్కొన్నారు. కానీ దీనిపై విపక్షాలు ప్రశి్నస్తే తాను ఎన్నడూ రూ. 1.50 లక్షల కోట్ల ఖర్చవుతుందని చెప్పలేదంటూ సీఎం ఆవేశంతో ఊగిపోతున్నారని హరీశ్ ఎద్దేవా చేశారు. మూసీ పునరుజ్జీవం పేరిట ప్ర జాధనం లూటీ చేయాలనుకొనే ప్రభుత్వ కు ట్రను బట్టబయలు చేస్తామనిస్పష్టం చేశారు. ప్రవీణ్ను ఆహ్వానించి అరెస్టు చేస్తారా? గోషామహల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరుల సంస్మరణ కార్యక్రమానికి మాజీ ఐపీఎస్ అధికారి, తమ పార్టీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ను ఓవైపు ఆహా్వనించి మరోవైపు హౌస్ అరెస్ట్ చేయడాన్ని హరీశ్రావు ఖండించారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తప్పుడు ప్రకటన చేశారని.. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదమని హరీశ్రావు ఓ ప్రకటనలో మండిపడ్డారు. -
రేవంత్,బండి సంజయ్ రహస్య మిత్రులు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్,బండి సంజయ్లు రహస్య మిత్రులని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సోమవారం(అక్టోబర్ 21)మీడియాతో మాట్లాడారు. రేవంత్ కుర్చీ పోతుంటే బండి సంజయ్కి బాధ ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్,బీజేపీ రహస్య ఒప్పందాలు ఖచ్చితంగా బయటకు వస్తాయన్నారు.‘రాహుల్ గాంధీ అశోక్ నగర్కు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వార్షికోత్సవం జరుపుకోవాలి. ముత్యాలమ్మ గుడిపై దాడిని నేను ఖండిస్తే తప్పేంటి? నేను ట్వీట్ చేసినందుకు నాకు సైబర్ క్రైమ్ వాళ్ళు నాకు లేఖ పంపారు. రేవంత్ లాంటి దగుల్బాజీ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడు.ఉద్యోగాల కల్పనపై సీఎం రేవంత్ అబద్దాలు చెప్తున్నాడు.మూసీ విషయంలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ ప్రశ్నించాల్సింది జర్నలిస్టులు. లక్షన్నర కోట్లు మూసీలో పోద్దామంటే చూస్తూ ఊరుకుందామా? లక్షన్నర కోట్లు జేబులో వేసుకుంటామంటే ఊరుకుంటామా? జర్నలిస్టులపై బీఆర్ఎస్కు ఎనలేని గౌరవం ఉంది. ఎన్నడూ నేను అవమానించలేదు.ఉద్యమంలో మాకంటే ఎక్కువ జర్నలిస్టుల పాత్ర ఉంది’అని కేటీఆర్ పేర్కొన్నారు.గ్రూప్ వన్పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం..‘గ్రూప్ వన్పై హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు ఫలితాలు వెల్లడించవద్దన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.రిట్ పిటిషన్పై వేగంగా వాదనలు విని నిర్ణయం తీసుకోమని సుప్రీం హైకోర్టుకు చెప్పింది.జీవో 29కు వ్యతిరేకంగా హైకోర్టులో అభ్యర్థుల తరుపున కొట్లాడుతాం.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిందే నిరుద్యోగులు.స్థానికుల కోసం కేసీఆర్ 95శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు.తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రమాణికం కాదనటనం అన్యాయం. జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుంది. గ్రూప్ - 1 అభ్యర్థుల తరుపున సుప్రీంకోర్టులో కేసు వేసిందే బీఆర్ఎస్.కపిల్ సిబల్ లాంటి ప్రముఖ న్యాయవాదిని నియమించాం’అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి: కేటీఆర్ ఇంటివద్ద భారీగా పోలీసులు -
సమాజ్వాదీ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి
గ్రేటర్ హైదరాబాద్లో సమాజ్వాదీ పార్టీ బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాడాలని ఏపీ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు పాశం వెంకటేష్ సూచించారు. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ సమాజ్వాదీ పార్టీ నేత, సామాజిక కార్యకర్త దండుబోయిన కళ్యాణ్ యాదవ్, తెలంగాణ మాదిగ దండోరా అధ్యక్షుడు మదిరె నర్సింగ్రావుతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల పార్టీలో చేరిన నేతలు వారి వారి ప్రాంతాల్లో శ్రేణులను ఐక్యం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలని తీర్మానించారు. త్వరలోనే సమాజ్వాదీపార్టీ జాతీయ అద్యక్షుడు అఖిలేష్ యాదవ్ సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో కమిటీలు వేస్తామని పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వ నమోదును నిర్వహిస్తామని తెలిపారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో యూపీలో ఏ విధంగా అయితే సమాజ్వాదీ విజయం సాధించిందో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే తరహా ఫలితాలు రాబట్టి యూపీలో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. -
రైతుల ద్రోహి కాంగ్రెస్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రైతుల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుబంధు ఎగిరపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘రైతుబంధు కావాలా..? రాబందు కావాలా?. ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా?. రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది!. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి... ఎకరానికి 15వేలు ఇస్తామని ఊదరగొట్టి.. ఉన్న పదివేలు ఊడగొట్టారు!. పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే.. అన్నదాత వెన్ను విరవడమే..!. రైతు ద్రోహి కాంగ్రెస్.. చరిత్ర నిండా అనేక రుజువులు.. ఇప్పుడు ఇంకొకటి!’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.రైతుబంధు కావాలా..? రాబందు కావాలా..? ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా..? రైతుబంధు ఎగిరిపోయింది..రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది!నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి..!ఎకరానికి 15వేలు ఇస్తామని ఊదరగొట్టి..ఉన్న పదివేలు ఊడగొట్టారు..!పంట పెట్టుబడి… pic.twitter.com/fGpgRLZDB3— KTR (@KTRBRS) October 21, 2024 -
పరీక్షలను రీషెడ్యూల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగాల కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నష్టం కలిగేలా రూపొందిన జీవో 29ను వెంటనే ఉపసంహరించుకోవాలని, గ్రూప్–1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెల్లవారితే పరీక్ష అని తెలిసి కూడా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారంటే.. వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని లేఖలో కోరారు. నిరుద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి, వారి డిమాండ్ మేరకు మార్పులు చేయాలన్నారు.జీవో 29 వల్ల 5,003 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అనర్హులయ్యారని.. 563 పోస్టులకు గుండుగుత్తగా 1ః50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం అన్యాయమని సంజయ్ పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీలో అర్హత సాధించిన రిజర్వ్డ్ అభ్యర్థులను.. రిజర్వ్ కేటగిరీలో చేర్చడం అన్యాయమని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, రూల్ ఆఫ్ రిజర్వేషన్కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. పరీక్షలను రీషెడ్యూల్ చేయని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తుండటాన్ని గుర్తించాలని లేఖలో కోరారు. అసలు రిజర్వేషన్లనే రద్దు చేస్తున్నారన్న చర్చకు ఈ జీవో దారితీసిందని పేర్కొన్నారు. -
'గ్రూప్–1'పై ఆదుర్దా.. ఆందోళన..
‘‘మేం రాజకీయాలకు అతీతం.. మా చివరి అవకాశాన్ని వృ«థా చేయకండి. ఆర్థికంగా, మానసికంగా నష్టపోయి ఉన్న మా బాధ వినండి. పరీక్షలు వాయిదా వేయండి’’.. – ఇదీ నిరుద్యోగ అభ్యర్థుల ఆవేదన ‘‘అంతా సవ్యంగానే ఉంది. జీవో 29 విషయంలో గానీ, మెయిన్స్కు అర్హత పొందిన అభ్యర్థుల విషయంలోగానీ నిరుద్యోగులకు ఎలాంటి నష్టం లేదు. అపోహలకు పోకుండా పరీక్షలు రాయండి. అన్ని ఏర్పాట్లు చేశాం’’.. – ఇదీ పరీక్షలు నిర్వహించేయాలన్న ఆదుర్దాలో రాష్ట్ర ప్రభుత్వం సూచన.సాక్షి, హైదరాబాద్: .. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల విషయంలో ఇరుపక్షాలు పట్టువీడని పరిస్థితి. పరీక్షలను వాయిదా వేయాల్సిందేనంటూ నిరుద్యోగులు, అభ్యర్థులు ఓ వైపు ఆందోళనలను కొనసాగిస్తుండగానే.. మరోవైపు పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసేసింది. జీవో 29 కారణంగా రిజర్వుడ్ కేటగిరీల వారికి నష్టం జరుగుతుందని అభ్యర్థులు మొత్తుకుంటుంటే.. అలాంటిదేమీ లేదంటూ ప్రభుత్వం ముందుకెళుతోంది. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేయాల్సిందేనంటూ ఆదివారం నిరుద్యోగులు, అభ్యర్థులు హైదరాబాద్లోని అశోక్నగర్ చౌరస్తాలో బైఠాయించినా.. గాందీభవన్ ముట్టడికి ప్రయత్నించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కనీసం అభ్యర్థులు ప్రెస్మీట్ పెట్టి తమ ఆవేదన చెప్పుకొనేందుకు కూడా అనుమతించలేదు. ప్రతిపక్షాల మద్దతుతో.. ఆందోళన తెలుపుతున్న అభ్యర్థులు, నిరుద్యోగులకు ప్రతిపక్షాలు బాసటగా నిలిచాయి. గ్రూప్–1 పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రశ్నించారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అశోక్నగర్కు వచ్చిన రాహుల్గాంధీ నిరుద్యోగ యువతకు చెప్పిందేమిటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడు చేస్తోందేమిటని నిలదీశారు. ఇక బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోవడం ఎందుకని, పరీక్షలను వాయిదా వేసి తప్పులను సరిదిద్దితే వచ్చిన నష్టమేంటని నిలదీశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ స్పందించారు. మెయిన్స్కు అభ్యర్థుల ఎంపికలో ఏ ఒక్క వర్గానికీ నష్టం జరగలేదని, భవిష్యత్తులోనూ నష్టం జరగకుండా చూస్తానని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో భరోసా ఇస్తున్నానని ప్రకటించారు. ఇక నిరుద్యోగుల ఆందోళనలను పట్టించుకోకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సోమవారం నుంచి గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో.. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకంటూ పరీక్షా కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు సుప్రీంకోర్టులో విచారణ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు, అభ్యర్థులు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది. అటు విద్యార్థుల ఆందోళన, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల మధ్య.. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. -
బీఆర్ఎస్,బీజేపీ రెచ్చగొడుతున్నాయి: పీసీసీ చీఫ్
సాక్షి,హైదరాబాద్:గ్రూప్ వన్ పరీక్షపై బీఆర్ఎస్,బీజేపీలు కుమ్మక్కై లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు.గాంధీభవన్లో ఆదివారం (అక్టోబర్20) ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు పార్టీల నేతలు యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ‘బీఆర్ఎస్,బీజేపీ నేతలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. బీసీ బిడ్డగా నేను మీకు భరోసా ఇస్తున్నా.సెలక్షన్ ప్రక్రియలో ఎక్కడా రిజర్వుడు కేటగిరీకి అన్యాయం జరగదు. జీఓ 29తో నష్టం అనేది అపోహ మాత్రమే. బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో బండి సంజయ్ చెప్పాలి.బీఆర్ఎస్ నియామకాల పేరుతోనే అధికారంలోకి వచ్చింది. పదేళ్లలో టీఎస్పీఎస్సీ నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి.ఇన్నాళ్లూ ఉద్యోగాలు ఇవ్వని మీరు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు’అని మహేశ్గౌడ్ మండిపడ్డారు.ఇదీ చదవండి: న్యాయం అడిగితే తలలు పగులగొడతారా: కిషన్రెడ్డి -
న్యాయం అడిగితే తలలు పగులగొడతారా: కిషన్రెడ్డి
సాక్షి,హైదరాబాద్:ఓ వైపు గ్రూప్ వన్ విద్యార్థులు,మరోవైపు ముత్యాలమ్మ గుడి భక్తుల ఆందోళనలతో వారం రోజులుగా హైదరాబాద్ అట్టుడుకుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి ఆదివారం(అక్టోబర్20) మీడియాతో మాట్లాడారు.‘సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంపై దాడి చేస్తే సీఎం ఎందుకు స్పందించలేదు. హిందువులను కాంగ్రెస్ ఎప్పుడూ శత్రువులుగానే భావిస్తోంది. పోలీసులు చాలా మంది భక్తుల తలలు పగులగొట్టారు. హిందువుల విషయంలో అనేక నిర్బంధాలకు గురిచేస్తున్నారు. న్యాయం కోసం ఆందోళనలు చేస్తే తలలు పగులగొడతారా.గ్రూప్ వన్ విద్యార్థులపై లాఠీఛార్జ్ సరికాదు. తెలంగాణలో మళ్లీ యువత రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ప్రాతిపదికన విద్యార్థులు చదువుకోవాలి. వికీపీడియా ఆధారంగా విద్యార్థులకు మార్కులు ఇస్తారా’అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైర్లు -
సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైర్లు
సాక్షి,కరీంనగర్జిల్లా: ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు మరో ఉద్యమం రావాల్సిందేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం(అక్టోబర్20) తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన అలయ్ బలయ్ సభలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు.‘కాంగ్రెస్ వాళ్లు మోసపూరితంగా అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు ప్రజలను గోస పెడుతున్నారు. కరోనా సమయంలోనూ రైతులకు రైతుబంధు పడాలన్న ఆశయంతో నడిచింది కేసీఆర్ ప్రభుత్వం.రూ.10వేలు వద్దు..రూ.15వేలు ఇస్తా అన్న రేవంత్ ఏం చేస్తున్నాడు.రేవంత్ రైతు వ్యతిరేకి. యాసంగికైనా రైతుబంధు కావాలంటే అందరూ సంఘటితం కావాలి.ఆరు గ్యారెంటీ పథకాలు ఏమయ్యాయి రేవంత్. ఫించన్లో కూడా దగా చేస్తుండు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. చీఫ్ మినిస్టర్ కాదు చీటింగ్ మ్యాన్. బోనస్ ఇస్తా అంటివి..ఏడపోయింది? దేవుడి మీద ఒట్టు పెట్టి రాజకీయం చేసే నాయకుడిని ఇప్పటి వరకు నేను చూడలేదు.రేవంత్ రెడ్డి చేసిన పాపాలకు ప్రజల్ని కాపాడు అని లక్ష్మినరసింహ స్వామి ఆలయానికి వెళితే నాపై కేసు పెట్టారు. నిరుద్యోగులను దేశ ద్రోహుల్లా చూస్తున్నారు.2లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి ఏమయ్యాయి. జీఓ 29 రద్దు చేయడమే గ్రూప్ 1 సమస్యకు పరిష్కారం.రాజ్యాంగాన్ని అమలు చేస్తా అన్న రాహుల్ గాంధీ ఏడబోయిండు.?ఎన్నికల ముందు వచ్చిన గాంధీలు ఏడబోయారు’అని హరీశ్రావు ప్రశ్నించారు. ఇదీ చదవండి: రేవంత్ నువ్వు రాహుల్ కాంగ్రెస్లో లేవా -
కాంగ్రెస్ది నయవంచక పాలన: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ నయవంచక పాలన కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గ్యారంటీల పేరుతో గారడీలు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్రావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ నేతలు రుణమాఫీపై పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది. గ్యారంటీల పేరుతో గారడీలు చేశారు. 11 నెలలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ వచ్చింది అన్ని పథకాలు మాయమయ్యాయి. పథకాల పాలన పోయి ఫొటోలకు ఫోజులు ఇచ్చే పాలన వచ్చింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’
సాక్షి, ఢిల్లీ: కొందరు తనను చంపాలని చూస్తున్నారని.. అందుకే ప్రధాని మోదీ, అమిత్లకు సెక్యూరిటీ కోసం లేఖ రాశానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను అందరి కోసం పనిచేస్తున్నా.. పని చేస్తూనే ఉంటాను. కేసులు వేస్తున్నా.. కోర్టుల్లో పోరాడుతున్నా.. ఎన్నో కేసుల్లో స్టేలు తీసుకొస్తున్నా. కేసులు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నాయి. మోదీ, చంద్రబాబు, పవన్, కాంగ్రెస్లు నాకు శత్రువులు. వేలాది మంది గ్రూప్-1 అభ్యర్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. అభ్యర్థులపై పోలీసు దాడులు బాధాకరం. వారిని గాయపరచడం సరైందా?’’ అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: అశోక్నగర్లో మరోసారి ఉద్రిక్తత..‘‘పరిపాలన చేత కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. వేలమందినీ ఎందుకు కొడుతున్నారు? ఇల్లీగల్ అర్డర్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పోలీసులు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మారాలి. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగేలా చేస్తున్నారు’’ అని కేఏ పాల్ నిలదీశారు. -
రేవంత్.. నువ్వు రాహుల్ కాంగ్రెస్లో లేవా?: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, ఢిల్లీ: రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ కొంగ జపం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాహుల్ గాంధీ వెంటనే అశోక్ నగర్కు రావాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అశోక్నగర్లో అభ్యర్థులను లాఠీలతో కొడుతున్నారు. వారి తలలు పగులగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్ సిటి లైబ్రరీకి వచ్చి అరచేతితో వైకుంఠం చూపించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ కొంగ జపం చేస్తున్నారు. గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. యువత చేస్తున్న డిమాండ్ను అర్థం చేసుకోవాలి. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. రిజర్వేషన్లకు చెల్లు చీటీ చేస్తున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లను ఉల్లంఘించి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. దగా చేస్తున్నారు.అభ్యర్థులపై లాఠీలు ఝుళిపిస్తున్నారు.. తలలు పగుల కొడుతున్నారు. ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. దీనిపై రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో మోసం చేస్తున్నారు. హర్యానా ఎన్నికల ఫలితాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. రాహుల్ గ్యారంటీల పేరుతో చేస్తున్న మోసాలో పట్ల జనం అప్రమత్తం అయ్యారు. కర్నాటకలో కాంగ్రెస్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంది. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ దోచుకుంటే.. మూసీ పేరుతో కాంగ్రెస్ దోచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. లక్షా 50వేల కోట్ల అవినీతికి కాంగ్రెస్ కుట్ర చేసింది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రైతులు.. రుణమాఫీ, హామీలపై ప్రశ్నిస్తుంటే.. వారిని పక్కదారి పట్టిస్తున్నారు. లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. మంత్రులు ఒక మాట, ఎంపీలు ఒక మాట చెప్తున్నారు. రైతు భరోసా లేకుండా పోయింది. కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారు. పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. రాహుల్ కాంగ్రెస్ వేరు.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలు వేరా?. ఉన్న అవకాశాలను కొల్లగొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జీవో-29 ద్వారా లక్షల మంది అవకాశాలను కొల్లగొడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదు. ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులకు బీజేపీ బాసటగా నిలుస్తోంది’ అంటూ హామీ ఇచ్చారు. -
రేవంత్ రహస్య మిత్రుడు బండి సంజయ్: బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అంటూ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో బండి సంజయ్, పోలీసులకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ షేర్ చేసింది.బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా..‘నిరుద్యోగులకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో ఈడ్చుకుంటూ లాక్కెళ్లి అరెస్ట్ చేయించిన రేవంత్ సర్కార్. కానీ తన రహస్య మిత్రుడు బండి సంజయ్కి భారీ భద్రత కల్పించి డ్రామా స్టంట్ చేయించాడు రేవంత్’ అంటూ వీడియోను షేర్ చేసింది.నిరుద్యోగులకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో ఈడ్చుకుంటూ లాక్కెళ్లి అరెస్ట్ చేయించిన రేవంత్ సర్కార్. కానీ తన రహస్య మిత్రుడు బండి సంజయ్ కి భారీ భద్రత కల్పించి డ్రామా స్టంట్ చేయించాడు రేవంత్. pic.twitter.com/JI9h8EHF7Z— BRS Party (@BRSparty) October 19, 2024అంతకుముందు బీఆర్ఎస్ నేతలు నిరుద్యోగులకు మద్దతుగా నిరసనల్లో పాల్గొన్న క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్న వీడియోను ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా షేర్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణలో ఓపెన్ కేటగిరీ పోస్టులను కేవలం అగ్రవర్ణాల్లో కొందరికే పరిమితం చేయడానికి @revanth_anumula ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి GO 29 కి వ్యతిరేకంగా వేలాదిమంది నిరుద్యోగ బిడ్డల తరపున పోరాడుతున్నందుకు సంతృప్తి గా ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 55 ఈ రోజు ఉండి ఉంటే నా… pic.twitter.com/iCSB3UuW3d— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 19, 2024 -
నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ కలెక్టరేట్లో గోషామహల్ నియోజవర్గానికి చెందిన లబ్ధి దారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. కులాలు, మతా లు, ప్రాంతాలు, పార్టీల వంటి తేడా లేకుండా అర్హులైన పేదవారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఎలాంటి భేష జాలకు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల సిన వాటాలు, నిధులు అడిగి తీసుకుంటామన్నా రు. గత ప్రభుత్వం పేదవాడి గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రతిపక్షాలు కాళ్లలో కట్టెలు పెడుతూ అడ్డుకోవాలని ప్రయత్నించినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయ లేనిది, తమ ప్రభుత్వం 10 నెలల్లో చేసి చూపిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఓర్వలేకపోతోంది..మూసీ పరీవాహక ప్రాంత వాసులకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం వారికి ఇండ్లు, ఉద్యోగం, ఉపాధి, కల్పిస్తుంటే బీ ఆర్ఎస్ ఓర్చుకోలేకపోతోందని మంత్రి పొంగులేని విమర్శించారు. ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్లు గా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు తమ జీవిత కాల మంతా అదే మురికికుప్పలో బతకాలని బీఆర్ఎస్ కోరుకుంటోందా? అని మంత్రి ప్రశ్నించారు. హైద రాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.మూసీ పునరుజ్జీవంపై అనేక అభాండాలు వేస్తున్నా రని, అక్కడున్న పేదవారిని అక్కడే వదిలేస్తారా అని ప్రశ్నించారు. మూసీ రివర్ఫ్రంట్ ఏర్పాటు చేసింది మీరు కాదా? అని నిలదీశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజా సింగ్, శ్రీ గణేశ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, రహమత్ బేగ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం అక్కర్లేదు.. మీ అవినీతిని నేను నిరూపిస్తా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తరువాత ఎవరి ఆదాయం ఎంతో.. ఎవరెంత దోచుకున్నారో ఎల్బీ స్టేడియం వేదికగా మీడియా సమక్షంలో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మాజీ మంత్రి హరీశ్రావు సీఎం ఇంటికి రానవసరం లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్, అధికార ప్రతినిధి భవానిరెడ్డి తదితరులతో కలిసి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్రావు విసిరిన సవాల్కు సమాధానం చెప్పేందుకు సీఎం రావలసిన అవసరం లేదని, తానే వస్తానని అన్నారు.కేసీఆర్ కుటుంబం పదేళ్లు సాగించిన అక్రమాలపై తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, అవినీతి, అక్రమాలు, దోపిడీని మొత్తం రుజువు చేస్తానని అన్నారు. రేవంత్రెడ్డి ఢిల్లీకి కప్పం కడుతున్నాడని అంటున్న వాళ్లు.. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్లాలకు ఇచ్చిన డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.మూసీ రివర్ ఫ్రంట్ లో రూ.లక్షా యాభై వేల కోట్ల దోపిడీ జరిగిందని ప్రజలను కేటీఆర్, హరీశ్రావు తప్పుదోవ పట్టిస్తు న్నారని అన్నారు. తెలంగాణను మొత్తం దోచుకు న్నదే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు అని, వాళ్లే ఇప్పుడు తాము నీతిమంతులమని మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో మూసీ ఒడ్డు నుంచి 50 మీటర్లు బఫర్ జోన్ అని జీవో నెంబర్ 7 ఇచ్చిందని, 50 మీటర్ల బఫర్ జోన్లో నా ఇల్లు కూడా పోతుందని జూపల్లి వెల్లడించారు. -
మీ పాలనలో మూసీని ఎందుకు శుద్ధి చేయలేదు?
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదిన్నరేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. మూసీని ఎందుకు శుద్ధి చేయలేదో ప్రజలకు తెలియజేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన సచివాలయంలో ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో కలసి మీడియాతో మాట్లాడారు. మూడు జిల్లాల ప్రజల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూసీ పునరుజ్జీవానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. మూసీ అభివృద్ధికి రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చెబుతున్నారని, మరి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని నిలదీశారు. కేటీఆర్, హరీశ్రావు.. ఇద్దరి నోటికి అదుపు లేకుండా ఉందని, అధికారం పోయినా అహంకారం మాత్రం తగ్గలేదని అన్నారు.ఎన్నికల్లో చిత్తుగా ఓడినప్పటికీ ఇంకా అధికారంలో ఉన్నట్లు ఊహించు కుంటున్నారని ఎద్దేవా చేశారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల ప్రజలు దాదాపు కోటి మందిపైన కాలుష్య ప్రభావం పడుతోందని అన్నారు. మూసీ నది, ఎస్టీపీలు ఏర్పాటు చేస్తే బాగుపడేది కాదన్నారు. ఇందులో విషపూరిత లవణాలను కూడా తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.మూసీ ప్రాజెక్టు పేరిట రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ పిచ్చి కూతలు కూస్తే జనాలు తంతారని, చాదర్ఘాట్, మలక్పేట్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఏముందో తనకు అర్థం కాలేవడం లేదన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని, మూసీ ప్రాజెక్టుకు అడ్డు పడితే జిల్లా ప్రజలు ఉద్యమిస్తారని హెచ్చరించారు. కేసీఆర్ మోసాలకు ఇప్పటికే నల్లగొండ నరకయాతన పడుతోందని, ఇప్పుడు ఆయన కొడుకు కూడా తయారయ్యారని ఆగ్రహించారు. కాగా, కేటీఆర్, హరీశ్రావు అమెరికాకు వెళ్లి ప్రభాకర్ రావును ఇండియాకు రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. -
మూసీ అభివృద్ధికి కాదు.. మీ దోపిడీకి వ్యతిరేకం
నాగోలు (హైదరాబాద్): మూసీ పునరుజ్జీవం కో సం రూ.26 వేల కోట్లు మించని వ్యయాన్ని లక్షన్నర కోట్లు కావాలని చెబుతుంటే ఎలా అంగీకరిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తాము మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, మీరు చేసే దోపిడీకి వ్యతిరేకమని అన్నారు. శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలతో కలిసి ఆయన నాగోల్ ఎస్టీపీని పరిశీలించారు. దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని (ఎస్టీపీ) నాగోల్లో 320 ఎంఎల్డీ సామ ర్థ్యంతో నిర్మించామని, ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు నల్లగొండ జిల్లాకు పోతాయన్నారు. ఈ ఎస్టీపీలను సక్రమంగా నడుపుకుంటే చాలన్నారు. మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్, టీడీపీ ప్రభు త్వాలేనని ఆరోపించారు. దక్షిణాసియాలోనే వంద శాతం మురుగు శుద్ధి కోసం రూ.3,800 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. నగరంలోని 54 నాలాల నుంచి మూసీలోకి మురికి నీరు వస్తోందని చెప్పారు. మూసీకి రెండువైపులా రిటైనింగ్ వాల్ కట్టండి బీఆర్ఎస్ హయాంలో మూసీపై 15 చోట్ల బ్రిడ్జిలను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్ వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య లు తలెత్తకుండా మూసీపై రూ.10 వేల కోట్లతో భారీ స్కై ఓవర్ నిర్మించాలనుకున్నామన్నారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూ లు చేస్తున్నారన్నారు. మూసీ పక్కన తాను మూడు నెలలు కాదు మూడేళ్లు ఉంటానని చెప్పారు. మూసీ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని తెలిపారు. మూసీకి రెండువైపులా రిటై నింగ్ వాల్ కట్టాలని సూచించారు. మూసీ పేరుతో జరుగుతున్న లూటీకి చరమగీతం పాడాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాద వ్, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, బంగారి లక్ష్మా రెడ్డి, వివేకానంద్గౌడ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొన్నారు. -
ఇక మీ ఫామ్హౌస్ల వద్దకు వస్తా!
చార్మినార్ (హైదరాబాద్): ఫామ్హౌస్లను కాపాడుకోవడం కోసమే మూసీ ప్రస్తావన తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని స్పష్టంచేశారు. మూసీ నదిలో దుర్భర జీవనం గడుపుతున్న నిరుపేదలను కాపాడుతూ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పనులను చేపట్టామన్నారు. రాజీవ్గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కమిటీ అధ్యక్షుడు, బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ ఆధ్వర్యంలో శనివారం చార్మినార్ వద్ద నిర్వహించిన సద్భావన దినోత్సవ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు.చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారు, జీవో 111ను ఉల్లంఘించిన వారు మాత్రమే హైడ్రాను చూసి భయపడుతున్నారన్నారు. అనుమతులున్న వారిని హైడ్రా ఏమీ చేయదన్నారు. మూసీ వద్దకు రావాలని సవాల్ విసిరిన వారి కోసమే తాను మూసీ (చార్మినార్) వద్దకే వచ్చానని.. ఇక మీ ఫామ్హౌస్ల వద్దకు వస్తానని బీఆర్ఎస్ నేతలపై ధ్వజమెత్తారు. కబ్జాదారులను అరికట్టడానికి హైడ్రా అంకుశం తరహాలో పని చేస్తుందన్నారు. గాంధీ కుటుంబం ఉంటేనే అన్ని వర్గాల పేదలకు అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలు అందుతాయని ప్రజలు భావించినందునే ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చారన్నారు.కొంతమంది సన్నాసులు కుటుంబ పాలన అంటున్నారని.. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో ముందుండడమే కాకుండా అన్నివర్గాల ప్రజలకు మేలు చేశారని చెప్పారు. కేసీఆర్ కుబుంబపాలనలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని.. వారి కుటుంబం దోపిడీ మాత్రమే చేసిందని ఎద్దేవాచేశారు. అడ్డం వస్తే.. బుల్డోజర్ సిద్ధంగా ఉంది...తాము పేదలను ఆదుకుంటుంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరైనా అడ్డం వస్తే తొలగించడానికి ఒక బుల్డోజర్ సిద్ధంగా ఉంచానన్నారు. ‘దొంగ నాటకాలాడుతున్న బావామరు దుల డ్రామాలన్నీ చూస్తున్నా.. చెప్పులు మోసేటో ళ్లూ మాట్లాడుతున్నారు.. మీ సంగతి నాకు తెలియదా.. మీలాగ దొంగతనాలు చేయలేదు.. చేతులు కట్టుకుని నా ముందు నిలబడిన రోజులు మర్చిపోయారా’ అంటూ వ్యాఖ్యానించారు. పేదల పట్ల ప్రేమ ఉంటే... కేటీఆర్, హరీశ్రావుల ఫామ్హౌస్లను వారే స్వయంగా కూలగొట్టుకుని పేదల వద్దకు రావాలని.. మీవి అక్రమ కట్టడాలు కావా? అని పేర్కొన్నారు.మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్, హైడ్రాను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నార న్నారు. అనంతరం రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ కలిసి మాజీ మంత్రి జె.గీతారెడ్డికి సద్భావనా అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ సలహాదా రులు వేం నరేందర్రెడ్డి, షబ్బీర్ అలీ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంత్రావు తదితరులు పాల్గొన్నారు. -
అపోహలొద్దు.. పరీక్ష రాయండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘గ్రూప్–1 విషయంలో అపోహలను నమ్మొద్దు. జీవో 55 ప్రకారం భర్తీ చేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు నష్టపోతారు. అందరికీ న్యాయం జరగాలనే జీవో 29ను తీసుకొచ్చాం. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 1ః50 ప్రకారం మెరిట్ ఆధారంగా మెయిన్స్కు సెలెక్ట్ చేశాం. ప్రతిపక్షాల ట్రాప్లో పడొద్దు. అభ్యర్థులంతా మెయిన్స్ పరీక్షకు హాజరుకావాలి. లేకపోతే బంగారం లాంటి అవకాశం కోల్పోతారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో శనివారం నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్–2024 ముగింపు కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్యూటీ మీట్ విజేతలకు ట్రోఫీలను బహూకరించారు. అనంతరం రేవంత్ మాట్లాడారు. జీవో 29 ప్రకారమే ప్రభుత్వం గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసిందని, మధ్యలో నిబంధనలు మారిస్తే పరీక్షలను కోర్టు రద్దు చేయొచ్చ న్నారు. తాము పరీక్ష నిర్వహిస్తున్న విధానాన్ని కోర్టులు సమర్థించాయని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధి కోసమే..: గ్రూప్–1 విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు వారి లబ్ధి కోసం వితండవాదం చేస్తున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువతను ఉసిగొల్పి ప్రాణాలు బలిగొన్నారని, వారు మాత్రం రాజకీయంగా లబ్ధిపొంది ఉన్నత పదవులు చేపట్టారని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వనివారు.. ఇప్పుడు పిలిపించుకుని మాట్లాడుతున్నారని, ఆందోళనలు చేయిస్తున్నారని, నిరుద్యోగులు వారి ఉచ్చులో పడొద్దని సూచించారు. ఇక ఆందోళనలో పాల్గొంటున్న నిరుద్యోగులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని పోలీసులను సీఎం ఆదేశించారు. నిరుద్యోగులపై లాఠీచార్జీలు, కేసులు పెట్టకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్.. పోలీస్ సిబ్బంది పిల్లల కోసం ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. గ్రేహౌండ్స్కు చెందిన 50 ఎకరాల స్థలంలో దానిని ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యా బోధన ఉంటుందని.. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ వరకు పోలీస్ పిల్లలకు చదువు అందిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి పోలీస్ డ్యూటీ మీట్ను సిబ్బందిలో స్ఫూర్తినిచ్చేలా నిర్వహించారని ఉన్నతాధికారులను అభినందించారు. తెలంగాణ సాధన కోసం కానిస్టేబుల్ కిష్టయ్య చేసిన త్యాగం 4 కోట్ల మంది మరువలేనిదన్నారు. తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శవంతంగా ఉండాలని సూచించారు. పోలీసుల పనితీరుతోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, చిన్న పొరపాటు జరిగినా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని చెప్పారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని, దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టొద్దని ఆదేశించారు. కాగా.. త్వరలోనే పోలీస్ స్పోర్ట్స్ మీట్ కూడా నిర్వహిస్తామని డీజీపీ జితేందర్ వెల్లడించారు. డ్యూటీ మీట్ ముగింపులో భాగంగా నిర్వహించిన డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
కోమటిరెడ్డి వినోదం పంచుతున్నారు: జగదీష్రెడ్డి
సాక్షి,సూర్యాపేటజిల్లా:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శనివారం(అక్టోబర్19)ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సబ్జెక్ట్పై కాకుండా కోమటిరెడ్డి బూతులు మాట్లాడుతున్నాడు.సమస్యను పక్కదారి పట్టిస్తూ మీడియాకు వినోదం పంచుతున్నాడు. మూసీ కాలుష్యానికి కారణం ఎవరో చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ ద్రోహ ఫలితమే మూసీ కాలుష్యం.1956లో మంచినీటితో ఉన్న మూసీని 2014 నాటికి కాలుష్యకాసారంగా మార్చింది ఎవరు. దొరలు,రజాకార్లకు నిలయం కాంగ్రెస్.కోమటిరెడ్డి బాష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’అని జగదీష్రెడ్డి మండిపడ్డారు.ఇదీ చదవండి: రేవంత్,బండిసంజయ్లది డ్రామా: కేటీఆర్ -
‘తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. అందుకు జీవో నంబర్ 29 ఓ సంకేతమన్నారు బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ..‘ తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోంది. సోనియా జన్మదినం... నిరుద్యోగుల బలిదినం కాబోతోంది.ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. గ్రూప్ 1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాల్సిందే. నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా?, నిరుద్యోగ ర్యాలీలో విధ్వంసం చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర, కేటీఆర్ ఓ యూజ్ లెస్ ఫెలో. నేను పేపర్ లీకేజీ చేసినట్లు ప్యామిలీతో కలిసి ప్రమాణం చేసే దమ్ముందా?. డ్రగ్స్ తీసుకుని చీకటి దందాలు సాగించిన బతుకు నీది. నా జోలికొస్తే... నీ చీకటి బతుకులను బయటపెడతా. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు బిడ్డా. కాంగ్రెస్తో కుమ్కక్కు రాజకీయాలు చేస్తోంది మీరు కాదా?, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, కాళేశ్వరం కేసులు రాకుండా చీకటి రాజకీయాలు చేస్తోంది మీరే. కాంగ్రెస్ తో పగలు ఫైటింగ్... రాత్రిళ్లు లవ్వింగ్ బతుకు మీది. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయింది. జేసీబీ పెట్టి లేపినా బీఆర్ఎస్ లేచే పరిస్థితి లేదు. 2028లో తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. సికింద్రాబాద్ లో భజరంగ్ దళ్ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్ ను ఖండిస్తున్నా. ప్రశాంతంగా జరుగుతున్న ప్రదర్శనను అడ్డుకుని హింసను సృష్టించడం దారుణం.. పోలీసుల తీరు దుర్మార్గం’ అని ధ్వజమెత్తారు.చదవండి: TG గ్రూప్-1 రగడ: సచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత -
ప్రజా క్షేత్రంలో ఏం హామీలు ఇచ్చారో గుర్తు చేసుకోండి: రేవంత్కు ఈటల సవాల్
సాక్షి, నిజామాబాద్: గ్రూప్-1 విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ దుర్మార్గ జీవో ఇచ్చిందని, 29ని సడలించాలని నిరుద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారని తెలిపారు. నిరుద్యోగుల ఆందోళనకు బీజేపీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు దీరి ఏడాది కావస్తోందని.. ఇప్పటి వరకు ఇచ్చినా ఏ హామీ సరిగా అమలు కావడం లేదని మండిపడ్డారు.‘ఏ రైతు అయినా రుణ మాఫీ కాకపోతే రెండు లక్షల రుణం తీసుకోండి రేవంత్ అన్నారు. నేను సీఎం కాగానే మాఫీ చేస్తామని అన్నారు. సూటిగా ఒకటే మాట అడుగుతున్నా. ప్రజా క్షేత్రంలో ఏం హామీలు ఇచ్చారో గుర్తు చేసుకోండి. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని ప్రజలు భావిస్తున్నారు. పెంచిన పింఛన్లు దేవుడెరుగు.. ఉన్న పింఛన్లు ఎత్తేస్తున్నారు. దేవుళ్ళ మీద ఒట్లు వేశారు. గట్టు మీద పెట్టేశారు. రిటైర్డ్ అయ్యిన ఉద్యోగులకు సెటిల్ మెంట్లు చేసే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతున్నారు.’ అని ఈటల పేర్కొన్నారు.