ప్రేమ జంట ఆత్మహత్య | lovers commited suicide in tamilnadu | Sakshi
Sakshi News home page

ప్రేమ జంట ఆత్మహత్య

Feb 6 2018 12:25 PM | Updated on Nov 6 2018 7:53 PM

lovers commited suicide in tamilnadu - Sakshi

ఆత్మహత్య చేసుకున్న ఎయిల్‌ అలియాస్‌ హేమంత్, నిత్య(ఫైల్‌)

వేలూరు: భర్త, కుమార్తెను వదిలి ఇంటి నుంచి వెళ్లిన ఓ మహిళ, ఆమె ప్రియుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వేలూరు జిల్లా తిరుపత్తూరు తాలుకా ముత్తంబట్టిలో జరిగింది. వివరాలు.. వేలూరు జిల్లా తిరుపత్తూరు తాలుకా ముత్తం బట్టి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ బాబుకి నిత్య(20)తో మూడేళ్లక్రితం  వివాహమైంది. వీరికి కుమార్తె జన్మించింది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన రాజంద్రన్‌ కుమారుడు హేమంత్‌ అలియాస్‌ ఎళిల్‌(21)కు నిత్యతో అక్రమ సంబంధం ఏర్పడింది. ప్రభు ఇంట్లోలేని సమయంలో నిత్య ఎళిల్‌తో ఉల్లాసంగా గడిపినట్లు తెలుస్తుంది. అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న ప్రభు నిత్యను మందలించినప్పటికీ వారి అక్రమ సంబంధం కొనసాగుతూనే ఉండేది.

దీంతో గత రెండు నెలల క్రితం నిత్య ఎళిల్‌తో కలిసి గ్రామం వదిలి వెళ్లి పోయింది. అనంతరం రెండు నెలలుగా వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. వారం క్రితం నిత్య భర్తకు ఫోన్‌ చేసి తాను ఇంటికి వచ్చేస్తానని తెలిపింది. ఇందుకు భర్త ప్రభు ‘నీవు వచ్చి పాపను తీసుకొని ఎళిల్‌తోనే జీవించేలా ఉంటే..’ గ్రామానికి రావద్దని స్పష్టం చేశాడు. ఆదివారం రాత్రి గ్రామానికి బైకుపై వచ్చిన నిత్య, ఆమె ప్రియుడు ఎళిల్‌ తిరువణ్ణామలై రోడ్డు వద్ద విషం తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు గమనించి తిరుపత్తూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే వారు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement