► వ్యవసాయదారులకు రూపే డెబిట్ కార్డులు
► ఫిక్స్డ్ డిపాజిట్లకు రూ.8.85 శాతం వడ్డీ సౌకర్యం
► నిబంధనలు లేకుండా రూ.10 లక్షల వరకు ముద్ర రుణాలు
► ఖమ్మంలో త్వరలో మరో రెండు ఎస్బీఐ బ్రాంచ్లు
► ఏప్రిల్ నాటికి ఎస్బీహెచ్లు ఎస్బీఐలోకి విలీనం: సీజీఎం గిరిధర్ కిని
ఖమ్మం వ్యవసాయం: ఎస్బీఐ గృహ నిర్మాణాలకు తక్కువ వడ్డీతో రుణాలను అందజేస్తూ ప్రోత్సహిస్తుందని హైదరాబాద్ సర్కిల్ ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ గిరిధర్ కిని స్పష్టం చేశారు. గురువారం నగరంలోని బస్ డిపోరోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్బీఐ బ్రాంచ్ను ఆయన ప్రారంభించారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గృహ నిర్మాణాలకు ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఎస్బీఐ కేవలం 8.65 శాతం వడ్డీతో గృహ నిర్మాణాలకు రుణాలను అందిస్తుందన్నారు.
వ్యవసాయదారులకు రూపే కార్డులు..
వ్యవసాయదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులతో పాటు రూపే కార్డులను కూడా త్వరలో అందజేయనున్నామని తెలిపారు. రూపే కార్డు రైతులకు ఎంతో మేలు చేస్తుందని, ఈ కార్డు ద్వారా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు వంటి వాటిని కొనుగోలులో వినియోగించుకోవచ్చని తెలిపారు. రైతులకు పంట రుణాలతో పాటు ట్రాక్టర్ లోన్స్, అతి తక్కువ వడ్డీతో బంగారంపై రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఫిక్స్డ్ డిపాజిట్లపై తమ బ్యాంక్ 8.85 శాతం వడ్డీని అందజేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ముద్రా’ రుణాలను ఎటువంటి జమానతు లేకుండా రూ. 10 లక్షల వరకు ఇస్తున్నామని ఆయన తెలిపారు.
త్వరలో మరో రెండు బ్రాంచ్లు
జిల్లాలో త్వరలో మరో రెండు ఎస్బీఐ బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం, నగరంలోని మమతా మెడికల్ కళాశాల రోడ్లో బ్రాంచ్లను ఏర్పాటు చేయనున్నట్ల ఆయన తెలిపారు. తెలంగాణలో వరంగల్ జిల్లా తరువాత ఖమ్మం జిల్లాలో ఎస్బీఐ సేవలు ఎంతగానో ముందంజలో ఉన్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఏప్రిల్ నాటికి ఎస్బీహెచ్ బ్యాంక్లు విలీనం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ఏప్రిల్ ఆఖరు నాటికి ఎస్బీఐలో విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీంతో ఎస్బీఐ రాష్ట్రంలో అగ్రగామిగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు బ్రాంచ్లన్నీ విలీనం అవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్బీఐ తెలంగాణ సర్కిల్ రూ. 3 లక్షల కోట్ల టర్నోవర్తో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం నారాయణ రాజా, డీజీఎం భాస్కర్, నూతన బ్రాంచి మేనేజర్ కె.రవీందర్, కార్పొరేటర్లు దోరేపల్లి శ్వేత, కుమ్మరి ఇందిర, నాగండ్ల దీపక్ చౌదరి, పాలెపు రమణ, నవీన్కుమార్, ఆర్టీసీ యూనియన్ నాయకులు, ఖాతాదారులు పాల్గొన్నారు.
తక్కువ వడ్డీతో హౌసింగ్ లోన్లు
Published Fri, Feb 24 2017 7:45 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement