భవనం కూలి ముగ్గురి మృతి | 3 died due to building collapse | Sakshi
Sakshi News home page

భవనం కూలి ముగ్గురి మృతి

Dec 15 2016 2:43 PM | Updated on Aug 28 2018 7:24 PM

శిథిలావస్థలో ఉన్న భవనం కూల్చివేస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు.

మేడ్చల్: శిథిలావస్థలో ఉన్న భవనం కూల్చివేస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా కేంద్ర సమీపంలోని గుండ్ల పోచంపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ పాత ఇంటిని కూల్చి వేస్తున్న సమయంలో భవన శకలాలు మీదపడి అందులో పని చేస్తున్న ముగ్గురు కార్మికులు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతిచెందినవారు ముత్యాలనాయుడు, బిక్షపతి, వెంకటేష్‌లుగా గుర్తించారు. గాయాలపాలైన వారిలో ఒకరు విఠల్ కాగా.. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement