ట్రాలీ బ్యాగ్లో బంగారం బిస్కెట్లు.. | 12 Gold bars worth Rs 38 lakh seized at Mumbai airport | Sakshi
Sakshi News home page

ముంబయి విమానాశ్రయంలో గోల్డ్ బిస్కెట్లు సీజ్

Oct 21 2016 8:57 AM | Updated on Sep 4 2017 5:54 PM

ట్రాలీ బ్యాగ్లో బంగారం బిస్కెట్లు..

ట్రాలీ బ్యాగ్లో బంగారం బిస్కెట్లు..

అధికారులు ఎంత నిఘా పెట్టినా...అక్రమార్కులు మాత్రం వివిధ మార్గాల ద్వారా బంగారాన్ని తరలిస్తూనే ఉన్నారు.

ముంబయి: అధికారులు ఎంత నిఘా పెట్టినా...అక్రమార్కులు మాత్రం వివిధ మార్గాల ద్వారా బంగారాన్ని తరలిస్తూనే ఉన్నారు. తాజాగా ముంబయిలోని ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా రూ.38 లక్షల విలువైన 12 గోల్డ్ బిస్కెట్లను  కస్టమ్స్ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు.

ట్రాలీ బ్యాగ్లో తరలిస్తున్న 12 బంగారు బిస్కెట్లను సీజ్ చేసిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  గత నెలలో కూడా దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 19 లక్షల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు.  మరోవైపు బీఎస్ఎఫ్ జవాన్లు గురువారం ఓ బంగ్లాదేశీ పౌరుడు వద్ద సుమారు కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement