ఆంధ్ర అలవోక విజయం

ఆంధ్ర అలవోక విజయం


సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీ గ్రూప్-సిలో ఆంధ్ర సునాయాస విజయం సాధించింది. జార్ఖండ్‌తో ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. టోర్నీలో ఆంధ్రకిది రెండో విజయం కాగా, ఈ రెండూ సొంతగడ్డపైనే సాధించింది. చివరి రోజు 10/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 47 పరుగులు చేసి గెలిచింది. శ్రీకర్ భరత్ (35 బంతుల్లో 25, 3 ఫోర్లు) నిష్ర్కమించగా, ప్రశాంత్ (27 బంతుల్లో 20 నాటౌట్, 3 ఫోర్లు), శ్రీరామ్ (1 నాటౌట్) అజేయంగా నిలిచారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top