విలియమ్సన్ సెంచరీ | Williamson guides New Zealand to 299-5 | Sakshi
Sakshi News home page

విలియమ్సన్ సెంచరీ

Dec 17 2014 8:57 PM | Updated on Sep 2 2017 6:20 PM

విలియమ్సన్ సెంచరీ

విలియమ్సన్ సెంచరీ

పాకిస్థాన్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 299 పరుగులు చేసింది.

అబుదాబి: పాకిస్థాన్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 299 పరుగులు చేసింది. పాకిస్థాన్ కు 300 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ కెప్టెన్ కానే విలియమ్సన్ సెంచరీ సాధించాడు. 105 బంతుల్లో 12 ఫోర్లతో 123 పరుగులు చేశాడు.

గుప్తిల్(58) అర్థ సెంచరీతో రాణించాడు. బ్రౌన్లీ 43, టేలర్ 23, ఆండర్సన్ 23, లాథం 14 పరుగులు చేశారు.  పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ ఇర్ఫాన్ 2 వికెట్లు పడగొట్టాడు. తన్వీర్, అన్వర్ అలీ, ఆఫ్రిది తలో వికెట్ దక్కించుకున్నారు.

పాకిస్థాన్ లోని  పెషావర్ లో ఆర్మీ పాఠశాలపై దాడిలో మృతిచెందిన వారి ఆత్మశాంతి కోసం మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు రెండు నిమిషాలు మౌనం పాటించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement