తెలంగాణకు 8 స్వర్ణాలు | Telangana won 8 Gold Meddal in National National Martial Arts | Sakshi
Sakshi News home page

తెలంగాణకు 8 స్వర్ణాలు

Jul 24 2018 10:11 AM | Updated on Jul 24 2018 10:11 AM

Telangana won 8 Gold Meddal in National National Martial Arts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ మార్షల్‌ ఆర్ట్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. బ్రూస్‌లీ జీత్‌ కున్‌–డో స్పోర్ట్స్‌ ఆల్‌ స్టయిల్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో 8 స్వర్ణాలతో మెరిశారు. నగరానికి చెందిన డ్రాగన్‌ షాడో కుంగ్‌ఫు మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ (డీఎస్‌కేఎంఏ)కి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఈ స్వర్ణాలను సాధించడం విశేషం. 18 ఏళ్లు పైబడిన విభాగంలో సబియా ఫాతిమా (ఆరెంజ్‌ బెల్ట్‌), మలీహ బేగం (ఆరెంజ్‌ బెల్ట్‌), సానియా బేగం (వైట్‌ బెల్ట్‌) స్వర్ణాలను గెలుచుకున్నారు.

అండర్‌–17 కేటగిరీలో షిఫా బేగం (ఎల్లో బెల్ట్‌), షఫికా బేగం (ఎల్లో బెల్ట్‌), అక్సా ఫాతిమా (ఎల్లో బెల్ట్‌), ఫిర్దౌస్‌ బేగం (వైట్‌ బెల్ట్‌), మేరాజ్‌ ఇర్ఫానా (ఎల్లో బెల్ట్‌) పసిడి పతకాలను సాధించారు. ఈ సందర్భంగా డీఎస్‌కేఎంఏ కోచ్‌ సయ్యద్‌ అన్సార్‌ అలీ జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన తమ విద్యార్థులను అభినందించారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement