పటిష్టస్థితిలో దక్షిణాఫ్రికా | Proteas in complete control against Australia at Wanderers | Sakshi
Sakshi News home page

పటిష్టస్థితిలో దక్షిణాఫ్రికా

Apr 2 2018 4:39 AM | Updated on Apr 2 2018 4:39 AM

Proteas in complete control against Australia at Wanderers - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగుతోంది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేశారు. ఆమ్లా (16), డివిలియర్స్‌ (6) త్వరగానే పెవిలియన్‌ చేరగా... మార్క్‌రమ్‌ (37; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం ఎల్గర్‌ (39 బ్యాటింగ్‌; 6 ఫోర్లు), కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (34 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.

చేతిలో 7 వికెట్లు ఉన్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలుపుకొని ప్రస్తుతం 401 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 110/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా చివరకు 221 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ (62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కమిన్స్‌ (50; 6 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడటంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ జోడీ విడిపోయాకా ఆసీస్‌ ఇన్నింగ్స్‌ కుప్పకూలింది. దీంతో సఫారీలకు తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ప్రత్యర్థి బౌలర్లలో ఫిలాండర్, రబడ, మహరాజ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement