'బంగ్లా' పై కర్ణాటక విజయం | karnataka beats bangladesh | Sakshi
Sakshi News home page

'బంగ్లా' పై కర్ణాటక విజయం

Sep 24 2015 7:07 PM | Updated on Sep 3 2017 9:54 AM

బంగ్లాదేశ్ 'ఎ' తో జరిగిన మూడు రోజుల మ్యాచ్ లో కర్ణాటక జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మైసూర్: బంగ్లాదేశ్ 'ఎ' తో జరిగిన మూడు రోజుల మ్యాచ్ లో కర్ణాటక జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు బంగ్లా విసిరిన 181 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కర్ణాటక 40.5  ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కర్ణాటక ఆటగాళ్లలో మమాంక్ అగర్వాల్(23), చిదంబరం గౌతమ్(49),అభిషేక్ రెడ్డి(36),శ్రేయాస్ గోపాల్(40) పరుగులు చేసి కర్ణాటక విజయంలో కీలక పాత్ర పోషించారు.

 

తొలి ఇన్నింగ్స్ లో 158 పరుగులు మాత్రమే చేసిన బంగ్లా'ఎ' జట్టు రెండో ఇన్నింగ్స్ లో 309 పరుగులు చేసి ఫర్వాలేదనిపించింది.కర్ణాటక తొలి ఇన్నింగ్స్ లో 287 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.అంతకుముందు భారత్ 'ఎ' తో జరిగిన అనధికార మూడు వన్డేల సిరీస్ లో బంగ్లా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement