యశస్వినికి స్వర్ణం | India won second gold in the pistol shooting championship. | Sakshi
Sakshi News home page

యశస్వినికి స్వర్ణం

Jun 26 2017 1:44 AM | Updated on Sep 5 2017 2:27 PM

ప్రపంచ జూనియర్‌ రైఫిల్, పిస్టల్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం లభించింది.

సుహుల్‌ (జర్మనీ): ప్రపంచ జూనియర్‌ రైఫిల్, పిస్టల్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం లభించింది. జూనియర్‌ మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత షూటర్‌ యశస్విని సింగ్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో యశస్విని 236.9 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డును సమం చేసింది. అంతకుముందు జూనియర్‌ పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో సౌరభ్, అన్‌మోల్, అర్జున్‌లతో కూడిన భారత జట్టుకు కాంస్యం లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement