40 టెస్టుల తర్వాత తొలి వికెట్‌.. | India loss Pujara wicket | Sakshi
Sakshi News home page

40 టెస్టుల తర్వాత తొలి వికెట్‌..

Aug 4 2017 11:00 AM | Updated on Sep 17 2017 5:10 PM

40 టెస్టుల తర్వాత తొలి వికెట్‌..

40 టెస్టుల తర్వాత తొలి వికెట్‌..

40 టెస్టులాడిన కరుణరత్నేకు ఇదే తొలి వికెట్‌ కావడం విశేషం.

కొలంబో: భారత-శ్రీలంక మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. 344/3 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో బరిలోకి దిగిన కోహ్లి సేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 92వ ఓవర్లో కరుణరత్నే వేసిన ఐదో బంతిని ఎదుర్కొన్న పుజారా(133) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు.
 
ఇప్పటి వరకు 40 టెస్టులాడిన ఈ లంక ఆటగాడికి ఇదే తొలి వికెట్‌ కావడం విశేషం. బ్యాట్స్‌మన్‌ అయిన కరుణరత్నే అప్పుడప్పుడు పార్ట్‌టైమ్‌ బౌలర్‌ అవతారమెత్తుతాడు. ఇంత వరకు కనీసం 10 ఓవర్లు కూడా వేయని  కరుణరత్నే బౌలింగ్‌లో పుజారా అవుటవ్వడం మరో విశేషం.
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement