సెమీస్‌లో బోపన్న జోడీ | Bopanna couple in semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో బోపన్న జోడీ

Oct 11 2014 12:49 AM | Updated on Sep 2 2017 2:38 PM

సెమీస్‌లో బోపన్న జోడీ

సెమీస్‌లో బోపన్న జోడీ

న్యూఢిల్లీ: షాంఘై మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం సంచలనం సృష్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

న్యూఢిల్లీ: షాంఘై మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం సంచలనం సృష్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. చైనాలోని షాంఘైలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న-మెర్జియా జోడీ 6-4, 3-6, 10-7తో నాలుగో సీడ్ మార్సెలో మెలో (బ్రెజిల్)-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంటను బోల్తా కొట్టించింది. 65 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం తొలి సెట్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేయగా... రెండో సెట్‌లో తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో బోపన్న జోడీ పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ పోస్‌పిసిల్ (కెనడా)-జాక్ సాక్ (అమెరికా) జంటను ఓడించిన బోపన్న ద్వయం సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా)లతో ఆడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement