
అంబటి రాయుడు డకౌట్
ఐపీఎల్-8 ఆరంభ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ 37 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయింది.
కోల్ కతా: కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఐపీఎల్-8 ఆరంభ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ 37 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయింది. అంబటి రాయుడు డకౌటయ్యాడు. మోర్కల్ బౌలింగ్ లో యూసఫ్ పఠాన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఓపెనర్ ఫించ్ 5, ఆదిత్య తారే 7 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
ముంబై 7 ఓవర్లలో 42/3 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ(28), ఆండర్సన్(0) క్రీజ్ లో ఉన్నారు. కోల్ కతా బౌలర్లలో మోర్కల్ 2 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ ఒక వికెట్ తీశాడు.