కొనసాగుతున్న వైఎస్‌ జగన్‌ 84వ రోజు పాదయాత్ర | Ongoing YS Jagan 84th Day Walk | Sakshi
Sakshi News home page

Feb 11 2018 2:29 PM | Updated on Oct 20 2018 6:19 PM

Ongoing YS Jagan 84th Day Walk - Sakshi

సాక్షి, నెల్లూరు : ఏపీ ప్రతి పక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 84వ రోజు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నెల్లూరులోని బోడగుడిపాడు శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్రకు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు నీరాజనం పలుకుతున్నారు. జననేత జగన్‌కు కొత్తపాలెం గ్రామ రైతులు, మహిళలు ఘన స్వాగతం పలికారు.

జక్కేపల్లి గూడురు క్రాస్‌ రోడ్డు, కొత్త పాలెం గ్రామాల మధ్య పాదయాత్ర కొనసాగుతుండగా.. వృద్ధులు, మహిళలను అప్యాయంగా పలకిరిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. కొత్తపాలెం, తుర్పుగుడ్ల దొన క్రాస్‌ మీదుగా వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement