161వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | 161 day Praja Sankalpa Yatra Started | Sakshi
Sakshi News home page

161వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

May 14 2018 9:12 AM | Updated on Jul 25 2018 4:07 PM

161 day Praja Sankalpa Yatra Started - Sakshi

సాక్షి, దెందులూరు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 161వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. సోమవారం ఉదయం మహేశ్వరపురం శివారు నుంచి తన పాదయాత్రను చేపట్టారు. జననేతతో కలిసి అడుగేయాడానికి పెద్ద ఎత్తున ప్రజలు మహేశ్వరపురం చేరుకున్నారు. అక్కడన నుంచి శ్రీపర్రు, గురకళ పేట మీదుగా లింగారావు గూడెం, మాడేపల్లి మీదుగా వెంకటాపురం చేరుకుంటారు. రెండువేల కిలోమీటర్ల మైలురాయిని దాటిన సందర్భంగా వెంకటాపురం దగ్గర నిర్మించిన 40 అడుగుల పైలాన్‌ను వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించనున్నారు. అక్కడ నుంచి ఏలూరు చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ యాత్రలు : ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయి చేరుకోనున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్‌సీపీ నేతలు కార్యకర్తలు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలు చేపట్టారు. రెండు రోజులపాటు జరిగే ఈ పాదయాత్రలో  ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇంచార్జ్‌లు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement