‘రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడు’ | BJP Leader GVL Narasimha Rao Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడు’

Nov 3 2018 3:06 PM | Updated on Nov 3 2018 3:33 PM

BJP Leader GVL Narasimha Rao Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చం‍ద్రబాబు నాయుడు రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడని జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన స్వార్థం కోసమే అమరావతి చుట్టూ అభివృద్ధి చేస్తున్నాడని, తనతో పాటు కొంతమంది తన అనుచరుల లబ్ధి కోసం ప్రాకులాడుతున్నాడని మండిపడ్డారు. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయటం సమంజసమని, కానీ చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నం చేయకపోవటం దుర్మార్గమన్నారు.

గతంలో చంద్రబాబు హైదరాబాదుకు విపరీతంగా నిధులు వెచ్చించాడని, దీంతో మిగతా ప్రాంతాలు అభివృద్ది చెందలేదన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని చెప్పారు. అమరావతి అభివృద్ది వెనుక పెద్ద కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపారు. చంద్రబాబు ముందుకు రావాలని, రాకపోతే రాయలసీమ ద్రోహిగా మిగిలి పోతాడని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement