‘అక్కడ లోకేష్‌ పోటీ చేసినా వైఎస్సార్‌సీపీదే గెలుపు’

Avanthi Srinivas Comments On Nara Lokesh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐటీ మంత్రి నారా లోకేష్‌ పోటీ చేసినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌దే గెలుపు అని అనకాపల్లి మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ అన్నారు. లోకేషే కాదు, చంద్రబాబు బరిలో ఉన్నా భారీ మెజారిటీతో గెలుస్తానన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని జగన్‌ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. టీడీపీ అంటే ఒక రాచరిక పాలన అని ప్రజలనుకుంటున్నారని, ఐదేళ్లు గుర్తుకు రాని ప్రజలు ఇపుడు ఉన్నపళంగా ఎలా గుర్తుకొచ్చారని ప్రశ్నించారు.

తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై పోరాటమంటూ చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్‌ను తిట్టారని, 2019లో కాంగ్రెస్‌ వారికి శాలువలు కప్పుతూ బీజేపీని తిడుతున్నాడని చంద్రబాబును ఆయన విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top