అమిత్‌షా పోటీ చేసినా మేమే గెలుస్తాం..!

Asaduddin Says We Will Defeat BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌లో పోటీ చేసినా తామే గెలుస్తామని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు అసెంబ్లీ స్థానాల్లో కూడా ఆ పార్టీ ఓటమిపాలవుతుందని ఆయన జోస్యం చెప్పారు. అమిత్‌ షా శనివారం తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఒవైసీ ట్విటర్‌ వేదికగా అమిత్‌ షాను విమర్శించారు. దేశంలో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్‌ ధరలకు, నిరుద్యోగ సమస్యకు బీజేపీ వద్ద ఎలాంటి సమాధానం లేదని ఆయన మండిపడ్డారు. కాగా తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అమిత్‌షా శనివారం తెలంగాణ పర్యటకు వచ్చిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top